తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలంలోని ఉట్నూరు గ్రామంలో ఉన్న కోట. చుట్టూ అడవుల మధ్య ఎత్తయిన గుట్టల ప్రాంతంలో ఉన్న ఈ కోట గోండు రాజులకు ప్రధాన స్థావరంగా ఉండేది.
గోండు రాజులు తమ స్థావరాలకోసం సా.శ. 1309లో మూడు ఎకరాల స్థలంలో ఉట్నూరులో కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు. ఈ కోటలో ఆత్రం రాజ్ గోండుల, సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్ర దాగివున్నది.
ఈ కోట చుట్టూ 8 అడుగుల లోతైన కందకం ఏర్పాటుచేశారు. కోటకు తూర్పుభాగంలో ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం పటిష్ఠమైన కలపతో, కోట లోపల ప్రహరీ గోడలు, బురుజులు వంటివి ఇటుక సున్నంతో పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. లోపలి ద్వారం పక్కగా ఎత్తయిన వేదికపైనున్న దర్బారు చోటికి చేరుకోవడానికి మెట్లు, ద్వారానికి ఎడమపక్క దిగుడు బావి, ఆనాటి రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు స్నానంచేయడానికి స్నాన వాటికలు, దుస్తులు మార్చుకునేందుకు వీలుగా రాతి గదులు మొదలైనవి ఏర్పాటుచేయబడ్డాయి. కోట వివరాలు, అప్పటి చరిత్రకు సంబంధించిన విషయాలన్ని కోటలోలప మోడీ లిపిలో రాయబడ్డాయి. కోటలో ఒక ఫిరంగి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆదివాసుల ఆధ్వర్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి.
గోండు రాజులు తమ స్థావరాలకోసం సా.శ. 1309లో మూడు ఎకరాల స్థలంలో ఉట్నూరులో కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించారు. ఈ కోటలో ఆత్రం రాజ్ గోండుల, సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్ర దాగివున్నది.
ఈ కోట చుట్టూ 8 అడుగుల లోతైన కందకం ఏర్పాటుచేశారు. కోటకు తూర్పుభాగంలో ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం పటిష్ఠమైన కలపతో, కోట లోపల ప్రహరీ గోడలు, బురుజులు వంటివి ఇటుక సున్నంతో పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. లోపలి ద్వారం పక్కగా ఎత్తయిన వేదికపైనున్న దర్బారు చోటికి చేరుకోవడానికి మెట్లు, ద్వారానికి ఎడమపక్క దిగుడు బావి, ఆనాటి రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు స్నానంచేయడానికి స్నాన వాటికలు, దుస్తులు మార్చుకునేందుకు వీలుగా రాతి గదులు మొదలైనవి ఏర్పాటుచేయబడ్డాయి. కోట వివరాలు, అప్పటి చరిత్రకు సంబంధించిన విషయాలన్ని కోటలోలప మోడీ లిపిలో రాయబడ్డాయి. కోటలో ఒక ఫిరంగి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆదివాసుల ఆధ్వర్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి