సినారె కవితా స్రవంతి అజరామరం; -మణినాథ్ కోపల్లె
మాతృమూర్తి మీద అభిమానంతో ‘నవ్వని పువ్వు’ సృష్టి 
యవ్వనాన  ప్రణయ గీతాల కవితలు 
పరిణితి దశలో మానవీయ కవితలు 
గేయ ఛందస్సు కవితల గతులు, ద్విపదకావ్యాల కవితలు 
నిరంతర సాహితీ వ్యవసాయం చేసే రైతుబిడ్డ  మన సినారె !!

ఆది నుంచి ఆధునికత  దాకా మానవ దశ పరిణామమే విశ్వంభర 
పాత్రలు లేని కథలో మానవుడే నాయకుడైన ‘విశ్వంభర’ 
మట్టిలో పుట్టిన మనిషి  చైతన్య స్థాయి బంధమే ‘విశ్వంభర’ 
విశ్వమానవతా దృక్పధం తో సాగిన ‘విశ్వంభర’  
కథాత్మక  గేయ కావ్యమై   ‘జ్ఞానపీఠం’  అందుకున్న  ‘విశ్వంభర’ 

 చదివింది ఉర్దూ మీడియం ఆశువుగా పలికాయి తెలుగు బావ కవితలు
ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడయినా వైస్ ఛాన్సలర్ అయినా
రాజ్య సభ మెంబరుగా పరిపాలనా దక్షత కలిగిన  కవి అయినా 
తెలుగు పండితులుగానే ఆసక్తి! 
ఎందరో విద్యార్ధులు, రచయితలు, గీత రచయితలకు స్ఫూర్తి !

అంతరాలను దర్శించే  గుణం వున్న స్రష్ట కవి సినారె 
జానపదుల సంస్కృతి ప్రభావంతో   సహజ కవి అయిన  సినారె
తెలుగు భాష సంచాలకులు గా  ఉన్న వైస్ ఛాన్సలర్ సినారె!
వేలాది సినీ గేయాలతో అందరి నోట చిరంజీవియైన  సినారె !
వేలాదిగాపుస్తకాలకు  పీఠికలు రాసిన సినారె!
సాహితీ సభలలో వారి ఉపన్యాసం ఎందరికో స్ఫూర్తి !

పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో బిరుదులు అందుకున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డికి ఈ చిరు అక్షర నీరాజనం!

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం