చౌసతి యోగిని దేవాలయం..; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 చౌసతి యోగిని దేవాలయం. (64 యోగినుల మందిరం) ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ పట్టణానికి 20 కి.మీ.ల దూరంలో హీరాపూర్ అనే పల్లెలో ఉంది. 
ఈ మందిరాన్ని 9వ శతాబ్దంలో రాణీ హీరాదేవి నిర్మించినట్లు భావిస్తున్నారు.ఘఘ
ఈ దేవాలయం వృత్తాకారంలో పూర్తిగా ఇసుకరాయితో కట్టబడింది. లోపలి వైపు గోడకు గూళ్లు ఉన్నాయి. ప్రతి గూటిలోను ఒక దేవత బొమ్మ చొప్పున 56 దేవతా ప్రతిమలున్నాయి. ఇవి నల్లని రాతితో చెక్కబడి గోడకు ఇమడ్చబడి ఉన్నాయి. ఈ గుడి మధ్యలో మూల విగ్రహం కాళి రాక్షసుడి తలపై కాలుపెట్టి నిలబడిన భంగిమతో కనిపిస్తుంది. ఈ గుడి మధ్యభాగంలో చండీ మండపం ఉంది. దానిలో మిగిలిన 8 దేవతా విగ్రహాలు నాలుగు వైపులా ఉన్నాయి. కొంతమంది చరిత్రకారులు ఈ చండీ మంటపంలో మహాభైరవుని పూజించినట్లు ఊహిస్తున్నారు.
ఇది పైకప్పు లేని ఒక తాంత్రిక దేవాలయం. ఇక్కడ పంచభూతాలను ఆరాధిస్తూ క్షుద్రపూజలను నిర్వహిస్తారు.
ఇక్కడి పూజారుల స్థల పురాణం ప్రకారం దుర్గాదేవి రాక్షస సంహారం కొరకు 64 గ్రామదేవతల రూపాలలో వెలసింది. ఈ 64 మంది యోగినులు యుద్ధం అనంతరం దుర్గాదేవిని తమ ఉనికిని చాటడానికి ఒక దేవాలయాన్ని సృష్టించాల్సిందిగా కోరారు.
ఈ యోగిని విగ్రహాలు సాధారణంగా స్త్రీ మూర్తుల రూపంలో ఒక జంతువును వాహనంగా చేసుకుని చేతిలో రాక్షసుని తలను పట్టుకుని శక్తి రూపంలో ఉన్నాయి. ఈ ప్రతిమలలో క్రోధము, దుఃఖము, సంతోషము, ఆహ్లాదము, లాలస మొదలైన అన్ని భావాలు వ్యక్తమౌతున్నాయి.
ఇటువంటి మందిరమే ఒడిషా రాష్ట్రం బలంగిర్ జిల్లాలోని రాణిపూర్- ఝరియల్ ప్రాంతంలోను, భారతదేశంలో మరో ఏడుచోట్ల నెలకొని ఉన్నాయి.
హిందూ పురాణాల ప్రకారము 64 సంఖ్య చతుష్షష్ఠి కళలను సూచిస్తున్నది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం