తిప్పడంపల్లి కోట.; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ఆత్మకూరు సంస్థానానికి తిప్పడంపల్లి రాజధానిగా ఉండేది. ఆత్మకూరు సంస్థానానికి ‘అమరచింత’ సంస్థానం అనే పేరు కూడా ఉంది. ఈ సంస్థానానికి తూర్పున వనపర్తి సంస్థానం, పడమరన రాయచూరు, ఉత్తరాన నిజాం సరిహద్దులు, దక్షిణాన గద్వాల సంస్థానాలు ఉండేవి. 190 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 70 గ్రామాలు ఉండేవి.రెడ్డిరాజులు ఈ సంస్థానాన్ని పరిపాలించారు. చంద్రగిరికి చెందిన గోపాల్‌రెడ్డికి కాకతీయ సామంత రాజులతో ఏర్పడిన పరిచయం కారణంగా సా.శ.1268లో వడ్డేమాన్‌కు మగతల నాగగౌడ పదవితో ఇచ్చి సంస్థాన బాధ్యతలను అప్పగించారు.అమరచింత ఈ సంస్థాన మూల పురుషుడు గోపాల్‌రెడ్డే అని చరిత్రకారులు పేర్కొంటున్నారు.సా.శ.1268లో గోపాల్‌రెడ్డితో ప్రారంభమైన ఆత్మకూరు ప్రస్థానం 1948లో సంస్థానం విలీనం అయ్యేవరకూ కొనసాగింది.ఈ సంస్థానానికి చివరిగా రాజా శ్రీరామభూపాల్ బాధ్యతలు వహించారు. తిప్పడంపల్లి రాజధానిగా చేసుకుని రాజా పెదవెంకటరెడ్డి, బాలకృష్ణారెడ్డి, సీతారామభూపాలుడు,శ్రీరాంభూపాలుడు,రాణి భాగ్యలక్ష్మమ్మ వరకు ఈ ఐదుగురు పరిపాలన సాగించారు.అయితే తిప్పుడంపల్లి నుండి ఆత్మకూరుకు రాజధాని మారింది.ఇక్కడ కోట నిర్మించిన తరువాత ఆత్మకూరుకు ఎందుకు మార్చవలసివచ్చిందో కారణాలు ఇతమిద్దంగా తెలియవు. సంస్థానానికి చివరి పాలకురాలు రాణి భాగ్యలక్ష్మమ్మ.
ఆత్మకూరు సంస్థానం నేడు శిథిలావస్థకు చేరుకుంది. కోట లోపలి భాగంలో ఎలాంటి రాజ భవనాలూ లేవు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలు కోట లోపల ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం