రాచకొండ.కోట .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలోని గ్రామం.
ఇది మండల కేంద్రమైన నారాయణపూర్ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నల్గొండ నుండి 65 కి. మీ. దూరంలో ఉంది.
రాచకొండ పర్యాటక ప్రాముఖ్యత గల ప్రదేశం. పట్టాభిగుట్ట దగ్గర ఒక గుహలోకల 'దశావతార' శిల్పాలు, పట్టణంలోని ఐదు దేవాలయాలు కాకతీయుల శిల్పకళకు చక్కటి నిదర్శనాలు. రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా సా.శ.1325 నుండి 1474 వరకు మొత్తము తెలంగాణను పరిపాలించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఇలాంటి గుహలు 17 ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాచకొండ గుట్టల్లో రెండు రాతి గుహలు వెలుగులోకి వచ్చాయి. చరిత్ర పూర్వయుగానికి చెందిన.. అంటే రాత కనిపెట్టక ముందు కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో ఆదిమానవులు నివసించేవారనడానికి నిదర్శనంగా వారు వేసిన చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి. అంటే తెలంగాణ చరిత్ర చాలా ప్రాచీనమైనదని మరోసారి రుజువైందన్నమాట. ఇలాంటి గుహలు ఈ రాచకొండ గుట్టల్లో మరెన్నో ఉండొచ్చు.
 గుర్రాల గుట్ట మీద చాళుక్య యుగం నాటి వైష్ణవాలయం ఉంది. దీనికి సమీపంలోనే పెద్ద రాతి గుండ్ల మధ్య సహజసిద్ధమైన గుహ ఉంది. త్రిభుజాకార ముఖద్వారం ఉన్న ఈ గుహ సుమారు రెండు వందలమంది కూర్చునేంత వైశాల్యంతో ఉంటుంది. గుహలో తూర్పు పడమరలకు సహజ ద్వారాలుండగా ఉత్తర.. పడమర గోడలు ఏటవాలుగా ఉన్నాయి. ఒక పెద్ద గుండుపై మరో బండరాయి పడడంతో ఈ గుహ ఏర్పడింది. ఉత్తరం వైపు చూస్తున్న ఏటవాలు రాతి గోడ ఉపరితలం మీద చిత్రలేఖనాలున్నాయి. తూర్పు నుంచి పడమర వైపు కొనసాగుతున్న ఈ గోడకు మొదట మనుషుల బొమ్మలు కనిపిస్తాయి. తరువాత దీర్ఘ చతురస్రాకారంలో పటం డిజైన్) బొమ్మ ఉంది.
సుమారు గజం పొడవు, అరగజం వెడల్పు పరిమాణాలతో ఉన్న ఈ పటం బొమ్మే ఇక్కడి చిత్రలేఖనాల్లో అతిపెద్ద చిత్రం. పటం బొమ్మకు పడమటి దిక్కున కొందరు మనుషుల బొమ్మలున్నాయి. వాటి తరువాత వరుసగా సుమారు ఆరేడు గజాల పొడవున ఎర్ర గీతలు గీసి ఉన్నాయి. సుమారు ఫీటు పొడవు, రెండు అంగుళాల వెడల్పుతో ఉన్న గీతల మధ్య దూరం అర ఫీటుంటుంది. నిజానికి ఈ గీతలు భక్తుల ప్రతిరూపాలు. పటం దైవానికి ప్రతీక. ఎదురుగా ఉన్న రాయిపై పద్మనాయకుల కాలాన చెక్కిన గణపతి శిల్పం ఉంది. గుర్రాల గుట్ట ప్రవేశ ద్వారానికి కుడివైపున కన్పించే పెద్ద గుండ్ల కింద మరో గుహ ఉంది. ఇక్కడేమో పెట్రోగ్లిప్స్ (petroglyphs), కప్యూల్స్ (cupules) ఉన్నాయి. రాయిపైన లోహ పరికరంతో చెక్కే చిత్రాలను ఇంగ్లీషులో పెట్రోగ్లిప్స్ అంటారు. రెండు సెం.మీ. ల లోతు, వృత్తాకారంలో ఉండే చిన్న చిన్న బద్దిలను కప్యూల్స్ అంటారు. ఇక్కడి పెట్రోగ్లిప్స్‌లో చాలా విశేషాలు చిత్రించి ఉన్నాయి. మొదటి చిత్రంలో ముగ్గురు మనుషులు, వారి కింద వరుసలో మరో ముగ్గురు కర్రలు, ఈటల సహాయంతో తమకు ఎదురుగా వస్తున్న పులిని ఎదుర్కొంటున్నట్లు చిత్రించి ఉంది.
ఈ ఆరుగురి మీద లింగం లేదా గుడిని పోలిన రేఖా చిత్రముంది. వీరి మధ్య పిరమిడ్ లేదా త్రిభుజాకారంలో ఆరు కప్యూల్స్ ఉన్నాయి. మనుషుల నుంచి ప్రారంభమై వరుసగా పులి కింది నుంచి వెనుకవైపునకు కప్యూల్స్ సుమారు 20 చిత్రించి ఉన్నాయి. ఈ కప్యూల్స్‌కు, పులికి మధ్య ఒక అడ్డు గీత నుంచి కిందికి నాలుగైదు గీతలు వేలాడుతున్నట్లుగా చిత్రమొకటి ఉంది. పై రేఖా చిత్రాలన్నింటి పొడవు సుమారు 6 అంగుళాలుండగా, వెడల్పు సుమారు రెండు అంగుళాలుంటుంది.
తెలంగాణలో వీటిని చెక్కిన మానవులు సుమారు క్రీ.పూ. 3 వేల సంవత్సరాల నుంచి క్రీ. పూ. ఒక వేయి సంవత్సరాల మధ్య కాలంలో జీవించి ఉండొచ్చు. పై చిత్రాలను బట్టి కొత్త రాతియుగం నాటికి తెలంగాణ ప్రజలు లోహ ఆయుధాలను వాడుతున్నారని వేట వారి ప్రధాన జీవనాధారం అని, దైవాన్ని పూజిస్తున్నారని, వారికి ఒక క్రమ సమాజం ఏర్పడిందని చెప్పవచ్చు. 
కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా వర్ధిల్లిన రాచకొండ చరిత్రకు సాక్ష్యంగా కొన్ని కట్టడాలు ఇక్కడ దర్శనమిస్తాయి. కానీ అంతకుముందు కూడా ఇక్కడ మరో చరిత్ర ఉందని చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన రెండు గుహల్లో ఇదే విషయం బోధపడుతుంది. మానవ నాగరికత, పరిణామ క్రమం, సంస్కృతికి మూలాలు ఈ రాతి గోడల మీద దర్శనమిస్తున్నాయి. మనది దక్కన్ సంస్కృతి అనడానికి దక్కన్ పీఠభూమి మీద ఉన్న కర్ణాటకలో, మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి చిత్రలేఖనాలున్నాయి. సంస్కృతి అంటే ఏంటి? చిత్రం, శిల్పం, నాట్యం, సంగీతం, సాహిత్యం.. ఇవే కదా.
ఇందులో మనిషి మొదటగా నేర్చుకుంది చిత్రలేఖనమే. ఆ చిత్రాలే మానవ జీవనవిధానాన్ని ప్రతిబింబింపజేస్తాయి. రాచకొండ రాతి గుహల్లో అలాంటి చిత్రాలే ఉన్నాయి. రాచకొండ దుర్గం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లగానే ఎడమవైపు గుర్రాల గుట్ట, కుడివైపు కచేరీ గుట్ట ఉంటాయి. ప్రాచీన చిత్రాలు వెలుగులోకి వచ్చిన రాతి గుహలు గుర్రాల గుట్ట మీద ఉన్నాయి. ఇంతకీ ఆ గుహల్లో ఏముంది? ఆ చిత్రాలు ఏం చెబుతున్నాయి? ఎప్పటివై ఉండొచ్చు?
రాతి చిత్ర శాస్త్రం ప్రకారం.. మొదటి గుహలోని చిత్రలేఖనాల్లో క్రూర జంతువులు, వేటాడిన జంతువులు, ఆయుధాలు లేకుండా పటం, మనుషులు మాత్రమే చిత్రించి ఉన్నాయి కాబట్టి ఇవి మధ్య రాతియుగానికి ముందువి అయి ఉండొచ్చు. తరువాత వచ్చిన కొత్త రాతి యుగానికి చెందినవి కూడా అయి ఉండొచ్చు. సున్నపు రాళ్లు, ఎరుపు రాళ్లు, ఆకు పసర్లలాంటివి వాడి ఈ చిత్రాలను గీసి ఉండొచ్చు. అందువల్లే ఇన్ని శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉన్నాయి. సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) వారు సీ14 టెస్ట్ ద్వారా, థెర్మోల్యుమిన్‌సెన్స్ డేటింగ్ ద్వారా కచ్చితంగా వీటిని ఎప్పుడు గీశారో తెలుసుకోవచ్చు.
రెండో గుహలోని చిత్రాలు మధ్యరాతి యుగానికి.. అంటే క్రీ.పూ. 10వేల సంవత్సరాల నుంచి క్రీ.పూ. 3 వేల సంవత్సరాల మధ్య యుగకాలంలో గీసి ఉండొచ్చు. ఈ కాలంలోనే తెలంగాణలో ఇలాంటి చిత్రలేఖనాలు రాతి గుహవాసాల్లో చిత్రించడం ప్రారంభమైందని ప్రొఫెసర్ ఎన్. చంద్రమౌళి రాసిన ప్రామాణిక గ్రంథం చెబుతోంది. ఈ రెండు గుహల్లోని చిత్రలేఖనంపై ప్రామాణిక పరిశోధన చేస్తే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశముంది.
ప్రముఖ అర్కియాలజిస్ట్ వీవీ కృష్ణశాస్త్రి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి గుహలు 28 ఉన్నట్లు రాశారు. అందులో 15 తెలంగాణలో, 13 ఆంధ్రా, రాయలసీమలో ఉన్నట్లు వివరించారు. వీటిలో తెలంగాణలో ఉన్నవాటి గురించి ప్రస్తావించారు కానీ వివరించలేదు.
రాచకొండ మీద పుస్తకం రాసేందుకు పరిశోధన చేస్తున్నాru. ఇందులో భాగంగానే వీటిని గుర్తించాru. రాష్ట్ర పురావస్తు శాఖ ఈ రెండు గుహల చుట్టూ కంచె వేయించి ఈ అరుదైన చిత్రలేఖనాలను పరిరక్షించాలి. ఇప్పటికే చిత్రలేఖనాల గుహ సమీపంలో రెండు చోట్ల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం