బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య ఆత్మాహుతి - అరుంధతి గా వశిష్ఠునితో వివాహం - బ్రహ్మ శివ కళ్యాణం కొరకు శివదేవిని ఆశ్రయించుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -*
*పరమశివుని మాయలో వున్న నాకు, విష్ణుమూర్తి, ఈ విధంగా శివుని ఆజ్ఞతో, నన్ను కప్పి వున్న మాయ పొరలను తొలగించి నాకు కర్తవ్యం బోధించారు.*
• బ్రహ్మ దేవా! నేను చెప్పేది శ్రద్ధగా విను. నా మాట వేద శాస్త్రములకు అనుగుణంగా నే వుంటుంది. ఈ సమస్తమునకు శివుడే సృష్టి కర్త. రుద్రుడు, నీవు, నేను కూడా పరమశివుని దివ్య అంగముల నుండే ఉద్భవించాము. నీవు సృష్టి, నేను పాలన, రుద్రుడు లయము చేయాలని ఆ పరమశువుడే నిర్ణయించారు. మనము ముగ్గురమూ పరమశివుని రూపాలమే అయినా, రుద్రుడు పరమశివుని పూర్ణ రూపం. మహాదేవుని వామ భాగము నుండి ప్రత్యక్షమైన ఉమా దేవి కూడా, లక్ష్మి, సరస్వతి, సతి అని మూడు రూపాలలో తనను తాను వ్యక్త పరచు కుంది. అయినా సతి, ఉమా దేవి యొక్క పూర్ణ రూపము. నేను లక్ష్మీ దేవిని, నీవు సరస్వతీ దేవిని పత్నులుగా పొందాము, శివుని ఆజ్ఞతో. రుద్రుడు, సతీదేవి ని కాలాంతరంలో వివాహమాడుతాడు అని కూడా చెప్పారు, శివుడు. అలా ప్రకటితమైన రుద్రుడు, కైలాసములో నివాసము వుంటున్నారు.*
*బ్రహ్మదేవా! శివమహాదేవుని కళ్యాణం జరగాలి అనే నీకోరిక తీరాలంటే తదేకదీక్షతో పరమశివుని కరుణ కోరుకుంటూ తపస్సు చేయి. శివదేవి అనబడే ఉమ, సతీదేవి గా మానవరూపము ధరిస్తేనే శివ మహాదేవుని కళ్యాణం జరుగుతుంది. అందువలన, శివదేవిని కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఆ తల్లిని మనసు నిండా నింపుకుని శివాశివుల వివాహం జరగాలి అనేకోరికతో తపస్సు చేయి. అప్పుడు ఆ తల్లి సతీదేవి గా దక్ష ప్రజాపతి ఇంట పుట్టి, రుద్రుడు గా వున్న శివదేవుని వివాహం ఆడుతుంది.*
*శివాశివులు ఇద్దరూ భక్త పరాధీనులు. వారు ఇద్దరూ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపలయి కూడా సగుణ స్వరూపులు అవగలరు. నీ తపస్సు కు మెచ్చి ఉమాదేవి సతీదేవి గా దక్షుని కుమార్తె గా అవతరించి రుద్రుని వివాహం చేసుకుంటుంది. కనుక, సతీదేవి పుట్టుక కొరకు నీవు తపస్సు చేయి అని పలికి అంతర్ధానం అయ్యాడు, విష్ణువు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
*సంధ్య ఆత్మాహుతి - అరుంధతి గా వశిష్ఠునితో వివాహం - బ్రహ్మ శివ కళ్యాణం కొరకు శివదేవిని ఆశ్రయించుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -*
*పరమశివుని మాయలో వున్న నాకు, విష్ణుమూర్తి, ఈ విధంగా శివుని ఆజ్ఞతో, నన్ను కప్పి వున్న మాయ పొరలను తొలగించి నాకు కర్తవ్యం బోధించారు.*
• బ్రహ్మ దేవా! నేను చెప్పేది శ్రద్ధగా విను. నా మాట వేద శాస్త్రములకు అనుగుణంగా నే వుంటుంది. ఈ సమస్తమునకు శివుడే సృష్టి కర్త. రుద్రుడు, నీవు, నేను కూడా పరమశివుని దివ్య అంగముల నుండే ఉద్భవించాము. నీవు సృష్టి, నేను పాలన, రుద్రుడు లయము చేయాలని ఆ పరమశువుడే నిర్ణయించారు. మనము ముగ్గురమూ పరమశివుని రూపాలమే అయినా, రుద్రుడు పరమశివుని పూర్ణ రూపం. మహాదేవుని వామ భాగము నుండి ప్రత్యక్షమైన ఉమా దేవి కూడా, లక్ష్మి, సరస్వతి, సతి అని మూడు రూపాలలో తనను తాను వ్యక్త పరచు కుంది. అయినా సతి, ఉమా దేవి యొక్క పూర్ణ రూపము. నేను లక్ష్మీ దేవిని, నీవు సరస్వతీ దేవిని పత్నులుగా పొందాము, శివుని ఆజ్ఞతో. రుద్రుడు, సతీదేవి ని కాలాంతరంలో వివాహమాడుతాడు అని కూడా చెప్పారు, శివుడు. అలా ప్రకటితమైన రుద్రుడు, కైలాసములో నివాసము వుంటున్నారు.*
*బ్రహ్మదేవా! శివమహాదేవుని కళ్యాణం జరగాలి అనే నీకోరిక తీరాలంటే తదేకదీక్షతో పరమశివుని కరుణ కోరుకుంటూ తపస్సు చేయి. శివదేవి అనబడే ఉమ, సతీదేవి గా మానవరూపము ధరిస్తేనే శివ మహాదేవుని కళ్యాణం జరుగుతుంది. అందువలన, శివదేవిని కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఆ తల్లిని మనసు నిండా నింపుకుని శివాశివుల వివాహం జరగాలి అనేకోరికతో తపస్సు చేయి. అప్పుడు ఆ తల్లి సతీదేవి గా దక్ష ప్రజాపతి ఇంట పుట్టి, రుద్రుడు గా వున్న శివదేవుని వివాహం ఆడుతుంది.*
*శివాశివులు ఇద్దరూ భక్త పరాధీనులు. వారు ఇద్దరూ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపలయి కూడా సగుణ స్వరూపులు అవగలరు. నీ తపస్సు కు మెచ్చి ఉమాదేవి సతీదేవి గా దక్షుని కుమార్తె గా అవతరించి రుద్రుని వివాహం చేసుకుంటుంది. కనుక, సతీదేవి పుట్టుక కొరకు నీవు తపస్సు చేయి అని పలికి అంతర్ధానం అయ్యాడు, విష్ణువు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి