బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుని తపస్సు - శివదేవి వరము ఇవ్వడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*శ్లో: ప్రసీద భగవత్ యాద్యే ప్రసీద శివరూపిణి! ప్రసీద భక్తవరదే జగన్మాయే నమోస్తుతే!!*
(శి.పు.రు.సం.స.ఖం. 12 / 14)
*అని కీర్తంచి అంబ దర్శనం పొందిన దక్షుడు, జగదంబా, మహామాయా నీవు నిత్యవు. నీవే సత్యానివి. భగవంతుడగు శివుడు, రుద్రుడుగా కైలాసంలో ఒంటరిగా తిరుగుతున్నాడు. రుద్రుడు పరమాత్మ అగు శివుని పూర్ణావతారము. నీవు ఉమవు. కానుక, నీవుతప్ప రుద్రుని భార్య గా వేరొకరు వుండలేరు. అందువలన, నీవు మానవ రూపములో నా ఇంట కూతురుగా పుట్టి, రుద్రుడుగా వున్న శివమహాదేవుని కళ్యాణం చేసుకోవలసింది. ఈ మీ ఇరువురి కళ్యాణం వలన లోకాలకు శుభం కలుగుతుంది. నీవు సౌందర్యలీలతో వారమోహినివి అయి సదాశివుని మోహింప చేయి తల్లీ.*
*ఇంతగా తనను ప్రార్ధించిన దక్షుని చూచి, శివదేవి అయిన ఉమ "దక్షా! నీ భక్తి నన్ను ఆకట్టుకుంది. నీ కోరిక దివ్యమైనదీ, సమస్త లోకాలకు ఆనందాన్ని కలిగించేది. నేను నీ కోరికను తప్పక తీరుస్తాను. మాహేశ్వరిని అయిన నేను, నీ ఇంటిలో నీ భార్య గర్భమున నీకు కూతురుగా జన్మిస్తాను. పరమశివుడు నిరాకారుడు. నిర్గుణుడు. నిర్వికారి. అందువలన ఆ స్వామికి పత్ని అవడానికి నేను సుదీర్ఘమైన తపస్సు ఆచరిస్తాను. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించి నన్ను తన పత్నిగా స్వీకరిస్తాడు. బ్రహ్మ, విష్ణువులు పరిపూర్ణులు అయినా, పరమశివుని నిత్యమూ కొలుస్తూ వుంటారు. ప్రతీ జన్మలోనూ, ఆదిశివుడు అనేక రూపములలో అవతరిస్తాడు. ఆ పరాత్పరుని ప్రతీ రూపంలో కూడా నేనే ఆయన దాసిని, ప్రియురాలను, పత్నిని. ఆ స్వామి వరముతో నేను ఆయన పత్నిని అవుతాను. కానీ, దక్ష ప్రజాపతి, ఒక విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు అయితే నీకు నా మీద ఆదరము, ప్రేమ, పోయి కటువుగా వ్యవహరిస్తావో అప్పుడు నేను నా శరీరాన్ని అగ్ని లో వదలి వేస్తాను. దీనికి తిరుగు లేదు. అని దక్షునికి వరము ఇచ్చి శివదేవి అయిన ఉమాదేవి అంతర్ధానం అవుతుంది.*
*ఉమయే తన ఇంట కూతురుగా జన్మిస్తుంది అనే సంతోషంలో ఇంటికి చేరుకుంటాడు, దక్ష ప్రజాపతి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
*దక్షుని తపస్సు - శివదేవి వరము ఇవ్వడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*శ్లో: ప్రసీద భగవత్ యాద్యే ప్రసీద శివరూపిణి! ప్రసీద భక్తవరదే జగన్మాయే నమోస్తుతే!!*
(శి.పు.రు.సం.స.ఖం. 12 / 14)
*అని కీర్తంచి అంబ దర్శనం పొందిన దక్షుడు, జగదంబా, మహామాయా నీవు నిత్యవు. నీవే సత్యానివి. భగవంతుడగు శివుడు, రుద్రుడుగా కైలాసంలో ఒంటరిగా తిరుగుతున్నాడు. రుద్రుడు పరమాత్మ అగు శివుని పూర్ణావతారము. నీవు ఉమవు. కానుక, నీవుతప్ప రుద్రుని భార్య గా వేరొకరు వుండలేరు. అందువలన, నీవు మానవ రూపములో నా ఇంట కూతురుగా పుట్టి, రుద్రుడుగా వున్న శివమహాదేవుని కళ్యాణం చేసుకోవలసింది. ఈ మీ ఇరువురి కళ్యాణం వలన లోకాలకు శుభం కలుగుతుంది. నీవు సౌందర్యలీలతో వారమోహినివి అయి సదాశివుని మోహింప చేయి తల్లీ.*
*ఇంతగా తనను ప్రార్ధించిన దక్షుని చూచి, శివదేవి అయిన ఉమ "దక్షా! నీ భక్తి నన్ను ఆకట్టుకుంది. నీ కోరిక దివ్యమైనదీ, సమస్త లోకాలకు ఆనందాన్ని కలిగించేది. నేను నీ కోరికను తప్పక తీరుస్తాను. మాహేశ్వరిని అయిన నేను, నీ ఇంటిలో నీ భార్య గర్భమున నీకు కూతురుగా జన్మిస్తాను. పరమశివుడు నిరాకారుడు. నిర్గుణుడు. నిర్వికారి. అందువలన ఆ స్వామికి పత్ని అవడానికి నేను సుదీర్ఘమైన తపస్సు ఆచరిస్తాను. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించి నన్ను తన పత్నిగా స్వీకరిస్తాడు. బ్రహ్మ, విష్ణువులు పరిపూర్ణులు అయినా, పరమశివుని నిత్యమూ కొలుస్తూ వుంటారు. ప్రతీ జన్మలోనూ, ఆదిశివుడు అనేక రూపములలో అవతరిస్తాడు. ఆ పరాత్పరుని ప్రతీ రూపంలో కూడా నేనే ఆయన దాసిని, ప్రియురాలను, పత్నిని. ఆ స్వామి వరముతో నేను ఆయన పత్నిని అవుతాను. కానీ, దక్ష ప్రజాపతి, ఒక విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు అయితే నీకు నా మీద ఆదరము, ప్రేమ, పోయి కటువుగా వ్యవహరిస్తావో అప్పుడు నేను నా శరీరాన్ని అగ్ని లో వదలి వేస్తాను. దీనికి తిరుగు లేదు. అని దక్షునికి వరము ఇచ్చి శివదేవి అయిన ఉమాదేవి అంతర్ధానం అవుతుంది.*
*ఉమయే తన ఇంట కూతురుగా జన్మిస్తుంది అనే సంతోషంలో ఇంటికి చేరుకుంటాడు, దక్ష ప్రజాపతి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి