బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుడు హర్యశ్వులకు, శబలాశ్వులకు జన్మనిచ్చుట - నారదునకు శాపం ఇవ్వడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*తన పదివేల మంది సంతానమైన హర్యశ్వులు తిరిగిరాని లోకాలకు వెళ్ళడానికి కారకుడు నారదుడు అని తెలుసుకుని, శివుని మాయలో వున్న దక్షుడు చాలా దుఃఖములో మునిగి పోయాడు. ఉత్తమమైన సంతానాన్ని కనడం ఎందుకు. వారు దూరమయ్యారని బాధపడటం ఎందుకు అని ఎంతగానో విచారుస్తూ వున్నాడు. అప్పుడు నేను (బ్రహ్మ) వెళ్ళి ఇది విధి లిఖితము. దీనికి ఎవ్వరూ కారణము గాదు. దైవ నిర్ణయమును తప్పించుకోలేము కదా అని నచ్చచెప్పి దక్షుని శాంత పరచాను. కొంతకాలము తరువాత అస్నికి గర్భము నుండి శబలాశ్వులనే వేయిమంది కుమారలకు జన్మ నిస్తాడు దక్షుడు. యుక్త వయసు వచ్చిన తరువాత శబలాశ్వులకు కూడా నారదుడు ఉపదేశించిన మీదట నారాయణ సరోవరమునకు వెళ్ళి నీరు తాకగానే జ్ఞానోదయం అయ్యి, పృధివి యొక్క అంతమును చూడటానికి వెళ్ళి ఇక తిరిగి రారు.*
*నారదా! నీ మనసులో ఎటువంటి వికారము వుండదు. నీవు ఎప్పుడూ శివ మహాదేవుని ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ పనులు చేస్తూ వుంటావు. శబలాశ్వులకు ఊర్ధ్వగతి కలుగ గానే, తపస్సు లో వున్న దక్షుని కి చెడు శకునాలు వినిపించాయి. అప్పుడు దక్షునికి శబలాశ్వులు కూడా హర్యశ్వులను అనుసరించి వెళ్ళారు అని తెలుస్తుంది. ఎంతో దుఃఖము కలుగుతుంది. శివ మాయలో వున్న దక్షుడు తనను తాను తెలుసుకో లేక పోతాడు. నారదుడు ఇంత పని చేసాడే అని బాధ పడుతూ ఉంటాడు.*
*అప్పుడు, దక్షునికి ఉపశమనం కలిగించడానికి నారదుడు అక్కడికి వస్తాడు. నారదుని చూచిన దక్షుడు, దుఃఖాన్ని ఆపుకోలేక, నారదా నీవు కపట సన్యాసి వేషంలో అందరినీ మోసం చేస్తున్నావు. నా పిల్లలు రుషి, పితృ, దేవ రుణం తీర్చుకోకుండా, సన్యసించారు. ఈ మూడు రుణములు తీరకుండా మోక్షము రాదు. వారిని తప్పు దారిలో నడిపించావు కదా! నారదా! ఇప్పటి నుండి నీవు మూడు లోకాలలో తిరుగుతూనే వుంటావు. నీకు వుండేందుకు ఎక్కడా చోటు దొరకదు. త్రిలోక సంచారి అవుతావు. అని శపిస్తాడు.*
*దేవ పార్షదులలో ఉత్తముడైన నారదుడు స్వయముగా శాపమును తొలగించుకునే సమర్ధత వున్నా, శివమహాదేవుని ఆజ్ఞగా దక్షుని శాపాన్ని స్వీకరిస్తాడు. ఇదే బ్రహ్మ భావము. స్థిత ప్రజ్ఞత.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
*దక్షుడు హర్యశ్వులకు, శబలాశ్వులకు జన్మనిచ్చుట - నారదునకు శాపం ఇవ్వడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -*
*తన పదివేల మంది సంతానమైన హర్యశ్వులు తిరిగిరాని లోకాలకు వెళ్ళడానికి కారకుడు నారదుడు అని తెలుసుకుని, శివుని మాయలో వున్న దక్షుడు చాలా దుఃఖములో మునిగి పోయాడు. ఉత్తమమైన సంతానాన్ని కనడం ఎందుకు. వారు దూరమయ్యారని బాధపడటం ఎందుకు అని ఎంతగానో విచారుస్తూ వున్నాడు. అప్పుడు నేను (బ్రహ్మ) వెళ్ళి ఇది విధి లిఖితము. దీనికి ఎవ్వరూ కారణము గాదు. దైవ నిర్ణయమును తప్పించుకోలేము కదా అని నచ్చచెప్పి దక్షుని శాంత పరచాను. కొంతకాలము తరువాత అస్నికి గర్భము నుండి శబలాశ్వులనే వేయిమంది కుమారలకు జన్మ నిస్తాడు దక్షుడు. యుక్త వయసు వచ్చిన తరువాత శబలాశ్వులకు కూడా నారదుడు ఉపదేశించిన మీదట నారాయణ సరోవరమునకు వెళ్ళి నీరు తాకగానే జ్ఞానోదయం అయ్యి, పృధివి యొక్క అంతమును చూడటానికి వెళ్ళి ఇక తిరిగి రారు.*
*నారదా! నీ మనసులో ఎటువంటి వికారము వుండదు. నీవు ఎప్పుడూ శివ మహాదేవుని ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ పనులు చేస్తూ వుంటావు. శబలాశ్వులకు ఊర్ధ్వగతి కలుగ గానే, తపస్సు లో వున్న దక్షుని కి చెడు శకునాలు వినిపించాయి. అప్పుడు దక్షునికి శబలాశ్వులు కూడా హర్యశ్వులను అనుసరించి వెళ్ళారు అని తెలుస్తుంది. ఎంతో దుఃఖము కలుగుతుంది. శివ మాయలో వున్న దక్షుడు తనను తాను తెలుసుకో లేక పోతాడు. నారదుడు ఇంత పని చేసాడే అని బాధ పడుతూ ఉంటాడు.*
*అప్పుడు, దక్షునికి ఉపశమనం కలిగించడానికి నారదుడు అక్కడికి వస్తాడు. నారదుని చూచిన దక్షుడు, దుఃఖాన్ని ఆపుకోలేక, నారదా నీవు కపట సన్యాసి వేషంలో అందరినీ మోసం చేస్తున్నావు. నా పిల్లలు రుషి, పితృ, దేవ రుణం తీర్చుకోకుండా, సన్యసించారు. ఈ మూడు రుణములు తీరకుండా మోక్షము రాదు. వారిని తప్పు దారిలో నడిపించావు కదా! నారదా! ఇప్పటి నుండి నీవు మూడు లోకాలలో తిరుగుతూనే వుంటావు. నీకు వుండేందుకు ఎక్కడా చోటు దొరకదు. త్రిలోక సంచారి అవుతావు. అని శపిస్తాడు.*
*దేవ పార్షదులలో ఉత్తముడైన నారదుడు స్వయముగా శాపమును తొలగించుకునే సమర్ధత వున్నా, శివమహాదేవుని ఆజ్ఞగా దక్షుని శాపాన్ని స్వీకరిస్తాడు. ఇదే బ్రహ్మ భావము. స్థిత ప్రజ్ఞత.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి