*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0127)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుడు 60 మంది కన్యలను వివాహమాడటం - వీరణిలో సంస్థ శివదేవి పుట్టడం - ఆమె చేష్టలతో తల్లిదండ్రులు ఆనందించడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
 *నారదా! నీవు నా కుమారుడవు. ముని శ్రేష్ఠుడవు. దేవతలకు ప్రియమైన వాడవు. అన్ని లోకాల మేలు కోరుకునే వాడివి. దక్షుడు నీకు త్రిలోక సంచారి అని శాపము ఇవ్వడం తెలుసుకుని దక్షుని వద్దకు వచ్చి శివమాయను విడమరచి చెప్పి మీ ఇద్దరికీ మరల స్నేహబంధం ఏర్పాటు చేసాను. తరువాత దక్షుడు తన భార్య వీరిణితో 60 మంది పుత్రికలను కని, వారిలో 10మందిని ధర్మునకు, 13మందిని కశ్యప మునికి, 27మందిని చంద్రునకు, భూత, అంగిరా, క్రుశ, అశ్వులకు ఇద్దరు చొప్పున, మిగిలి నలుగురి కన్యలను తార్క్ష్యుడు (అరిష్టనేమి)కి ఇచ్చి వివాహము శాస్త్ర బద్ధంగా చేసాడు. వీరి సంతానముతో భూమండలము సుసంపన్నం అయ్యింది.*
*పుత్ర పుత్రికల వివాహం అయిన తరువాత దక్షుడు తిరిగి జగదంబ తన కూతురిగా పుట్టాలి అని మనసులో స్థిర పరచుకుని భార్య వీరిణితో కలసి జగదంబ ను ధ్యాన్నించాడు. జగదంబ ప్రసన్నమై నేను వీరిణి గర్భము నందు జన్మిస్తాను అని వరము ఇస్తుంది. ఉమ, వీరిణి గర్భం లో నిలువగానే, అన్ని శుభసూచనలు కనిపిస్తాయి, దక్షునికి. వీరిణి కూడా శివదేవి మహిమతో బంగారు కాంతులతో ఆరోగ్యంగా నడయాడుతోంది. దక్షుని భార్య వీరిణి గర్భంలో భగవతి ఉమ వున్నది అని తెలుసుకుని బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు మిగిలిన దేవతలు చాలా సంతోషించారు. అన్ని లోకాలకు ఆద్య అయిన ఉమ, సతీదేవి గా జన్మిస్తోంది అని శివదేవికి పదే పదే నమస్కారాలు చేసారు. దక్ష ప్రజాపతిని, వీరిణిని ఆశీర్వదించి తమ తమ నెలవులకు వెళ్ళారు.*
*ఆకాశం నుండి మంగళ వాద్య ఘోష వినిపిస్తూ, పూల వర్షం కురిపిస్తూ, మేఘడు సన్నని చినుకుల అక్షతలు జల్లుతూ వున్న శుభ సమయంలో  వీరిణి గర్భంలో నవమాసాలు వున్న శివదేవి వీరిణి గర్భం నుండి సతీదేవి గా భూమి మీద అవతరించింది. తన ఇంట పుట్టిన శివదేవి అయిన సతిని చూచి, దక్షుడు ఆర్తితో కీర్తిస్తాడు. భగవతి జగన్మాతకు రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. దక్షుని ప్రార్ధనలు విన్న శివదేవి అయిన సతి ప్రసన్నురాలు అయ్యింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం