*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 021*
 *ఉత్పలమాల:*
*కంటి నదీతటంబుఁబొడ | గంటిని భద్రనగాధివాసమున్*
*గంటి నిలాతనూజ నురు | కార్ముక మార్గణ శంఖచక్రముల్*
*గంటిని మిము లక్ష్మణునిఁ | గంటి కృతార్ధుడనైతినో జగ*
*త్కంటక దైత్య నిర్దళన | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయా రూపమైన దశరధ రామా! రాక్షస సమూహాలను సంహరించి గోదావరీ నదీతీరంలో భద్రగిరి పైన ప్రత్యక్షమైన నిన్ను, భూదేవి కూతురు అయిన సీతా దేవిని, నీ తమ్ముడు లక్ష్మణుని చూసాను. నిత్యము నీ దగ్గర గా వుండే ధనస్సును, బాణాలను, శంఖు, చక్రాలను కూడా చూచి ధన్యుడనయ్యాను, రామా!...... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"ధన్యుడనైతిని ఓ రామా! నా పుణ్యము పండెను శ్రీ రామా!!" రామదాసు కీర్తన గుర్తుకు వచ్చింది. "కొలువై ఉన్నాడే కోదండపాణి! కొలువై ఉన్నాడే!",  "ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట! బాగ తెల్పగరాదా!" త్యాగరాజ కీర్తనలు. కంచెర్ల గోపన్న, త్యాగరాజు గార్లు ఇద్దరూ కారణ జన్ములే. రామ సేవకోసమే పుట్టినవారు. కేవలం రాముణ్ణి సేవించాలి కనుక సేవించలేదు, వీరు. ఆర్తి,ఆర్ద్రత తో నిండిన మనసులో, రామనామ రూపంలో రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని తెలియని ఒక తపనతో జీవనం సాగించారు. మనకందరకూ మార్గ దర్శకత్వం చేయడానికి. ఇంతటి ప్రాతఃస్మరణీయులకు నమస్కరిస్తూ మనం కూడా వారి దారిలో నడిచేటట్టు అనుగ్రహించమని వేడుకుంటూ.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం