*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 026*
 *ఉత్పలమాల:*
*"రా" కలుషంబు లెల్ల బయ | లంబడ ద్రోచిన "మా" కవాటమై*
*ఢీకొని ప్రోచు నిక్కమని | ధీయుతులెన్నఁదదీయ వర్ణముల్*
*గైకొని భక్తిచే నుడువఁ | గానరు గాక! విపత్పరంపరల్*
*దాకొనునే జగజ్జనుల | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
సముద్రమంతటి దయకు రూపమైన వాడా! దశరథుని కుమారుడా! నీ పేరులోని "రా" అక్షరము పాపములను పోగొడుతుంది. "మా" అక్షరము అజ్ఞానమును అడ్డుకునే తలుపు లాగా మా మనస్సు లోకి పాపపు ఆలోచనలు రాకుండా కాపాడుతుంది. ఇది తెలిసిన తెలివైన వారు భక్తి తో ఎప్పుడూ నీ నామమును జపించుతూ వుంటారు. అలా భక్తితో నీ నామ జపం చేసే వారికి కష్టాలు ఒకదాని తరువాత ఒకటిగా రానే రావు కదా...... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఈ కలియుగంలో ప్రస్తుత కాలములో నామ జపం, భక్తి మాత్రమే మనలను కాపాడ గలిగే తిరుగులేని బ్రహ్మాస్త్రాలు. నామ జపంతో పొందగలిగే భగవంతుని కృప అనుపమానము. అమేయము. ఒక హనుమ, అన్నమయ, త్యాగరాజు, భద్రాచల రామదాసు మొదలైన వారు నామ జపం విషయంలో మనకు మార్గదర్శకులు.  ప్రాతః స్మరణీయులు పరమాచార్య, రాఘవనారాయణ శాస్త్రి గారు, సద్గురువు శివానంద మూర్తి గారు వున్న సమయంలోనే మనం కూడా పుట్టటం అనేది మన పెద్దలు చేసుకున్న పుణ్య ఫలం. ఈ పెద్ద వారు, పుణ్యమూర్తులు ఆచరించి చూపిన జప మార్గాన్ని భక్తి శ్రద్ధలతో విడువకుండా ఆచరించి, పరమశివుని చేరుకునే అవకాశాన్ని, ఆ పరాత్పరుడు మనకు కలిపించాలని, ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం