*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-( 121 )*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య ఆత్మాహుతి - అరుంధతి గా వశిష్ఠునితో వివాహం - బ్రహ్మ శివ కళ్యాణం కొరకు శివదేవిని ఆశ్రయించుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -* 
*కామదేవుడు రతీదేవిని పెళ్ళి చేసుకుని తన భవనానికి వెళ్ళాడు. దక్షుడు మిగిలినవారు కూడా వారి వారి నివాసాలకు వెళ్ళారు. సంధ్య తపస్సు చేసుకోవడానికి వెళుంది.*
*నారదా! వెనుకకు ఒకసారి నాకు మోహావేశము కలిగినది. ఆ స్థితిలో నన్ను చూచిన పరమేశ్వరుడు అపహాస్యం చేసారు. నాకు వుక్రోషము, కోపము కలిగాయి. శివుని యందు ఈర్ష్యా భావము కూడా కలుగింది. వీటన్నిటికీ శివమాయ యే కారణము. నేను దక్ష మహాముని వున్నచోటికి వెళ్ళాను. అక్కడే, రతీ, కామదేవులు కూడా వున్నారు. నేను వారిని చూచి, మీరు ఎలా అయినా సరే, పరమశివుడు ఒక అందమైన స్త్రీ ని వివాహం చేసుకునేలా చేయమని చెప్పాను. కామదేవుడు నా సహాయం కోరాడు. నా నిశ్వాసము నుండి వసంతుడు మలయానిలుడు, ఇంకా మారగణములు (మన్మధుని గణములు) పుట్టాయి. వీరందరితో కూడి మన్మధుడు శివుని మోహింప చేయడానికి వెళ్ళాడు. కానీ, నిర్గుణుడు, నిర్వికారుడు, మనసును స్వాధీనమలో వుంచుకున్న శివుని, మన్మధుడు అతని పరివారం ఏమీ చేయలేక పోతాయి.*
*అప్పుడు ఎలాగైనా శివుని మోహంలో పడేయాలని, నా తండ్రి గురించి తపస్సు చేసాను. నాలుగు చేతులలో శంఖు, చక్ర, గదా, పద్మాలతో, బంగారు వస్త్రము ధరించి నాపై కరుణతో నా ముందు ప్రత్యక్షమై, నన్ను ఎందుకు తలచుకున్నావు. నీ కోరిక ఏమిటి అని అడిగాడు, నా తండ్రి. అప్పుడు, తండ్రీ, పరమశివుడు ఏదో ఒక రకంగా వివాహం చేసుకుని పత్నిని స్వీకరించితే గానీ, నా మనసులో బాధ పోదు. అందుకు తగిన ఉపాయము చెప్ప వలసినది అనిబాడిగాను.
*నాకోరిక విన్న నా తండ్రి, నాకు ఈ విధంగా కర్తవ్య బోధ చేసారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం