మారిన మనిషి;-వి.నందిని, 9వ తరగతి 'ఈ 'సెక్షన్సెల్:9959906527

 అనగనగా ఒక ఉరిలో చిన్న కుటుంబం ఉండేది. అందులో అమ్మ నాన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండేవారు. బాబు పేరు రమేష్ అమ్మాయి పేరు నిత్య. వాళ్ళ నాన్న మంచి వాడు కాదు. ఎందుకంటే ఎప్పుడూ నిత్య అనే అమ్మాయిని మంచిగా చూసుకునేవాడు కాదు. ఎప్పుడూ తిడుతుండేవాడు. కొడుతుండేవాడు. అలాగే రమేష్ ని కూడా తిడుతుండేవాడు. వాళ్ళ అమ్మ మాత్రం ఇద్దరినీ ఒకేలా చూసేది. అమ్మకు చాలా ఇష్టం వీళ్ళంటే. నిత్య ఏదైనా అడగగానే చేసేది రమేష్ కి కూడా. ఏది కాదు అని అనేది కాదు. వాళ్ళ అమ్మ చాలా కష్టపడి రమేష్ ఇంకా నిత్య ని చదువుపిస్తుంది వాళ్ల నాన్న మాత్రం ఏది పట్టించుకునే వాడు కాదు. అన్ని వాళ్ళ అమ్మే చూసుకునేది. రమేష్ నిత్యా చాలా బాధపడేవారు. ఎందుకంటే వాళ్ల నాన్న కోసం. నిత్య రమేష్ కి వాళ్ళ అమ్మానాన్నలతో ఉండటం చాలా ఇష్టం కానీ వాళ్ళ నాన్న కుదరనిచ్చేవాడు కాదు.  వాళ్ళ నాన్న అంటే కానీ వాళ్ళ నాన్నకి మాత్రం అస్సలు నచ్చదు.  నిత్య కూడా వాళ్ళ అమ్మానాన్నల పరిస్థితి చూసి అడిగేది. ఏదైనా రమేష్ కూడా ఎక్కువగా అడిగేవాడు కాదు. ఒకరోజు రాత్రి సమయం చాలా ఎక్కువగా గడిచింది. ఇంకా రావడం లేదు. వాళ్ళ నాన్న ఇక నిత్య రమేష్ చాలా భయంతో ఉన్నారు చాలాసేపటి తర్వాత వాళ్ల నాన్న వస్తాడు. బాగా తాగి వాళ్ల పైకి అరుస్తాడు నిత్య రమేష్ వాళ్ళ అమ్మను చాలా కొడతాడు.  నిత్య త్వరగా వెళ్లి ఇద్దరినీ ఆపుతుంది ఒకరోజు వాళ్ళ నాన్న బాగా తాగి ఇంటికి వెళ్లేటప్పుడు హఠాత్తుగా రోడ్డు ప్రమాదం జరుగుతుంది. వెంటనే అక్కడున్న ప్రజలు వాళ్ల భార్యకి ఫోన్ చేస్తారు. వాళ్ల భార్య త్వరగా వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుంది అక్కడున్న డాక్టర్లు లివర్ చెడిపోయింది అని అంటారు. అప్పుడు వాళ్ళ నాన్న కోసం నిత్య ఇంకా రమేష్ గుడిలో అడుక్కుంటూ వాళ్ళ నాన్న బ్రతకాలని పూజలు మరియు అడుక్కోవడం చేస్తారు. వాళ్ల నాన్న ప్రాణాన్ని బ్రతికిస్తారు. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కొన్ని రోజులకి తనకి వాళ్ళ భార్య జరిగిన కథ మొత్తం చెబుతుంది. ఇదంతా తెలిసిన నాన్నకి అప్పుడు నిత్యని ఇంకా రమేష్ ని క్షమాపణ అడుగుతాడు. ఇకనుంచి నేను మారిన మనిషిని అని చెబితే అందరూ సంతోషపడతారు.




కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం