ఈటీవీ పిల్లలం-మాటీవీ మల్లెలం.;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ .9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ఈటీవీ చిట్టి పిల్లలం
మాటీవీ పొట్టి మల్లెలం
ఓనమాలు రాసేటి వారలం
సినిమాలు చూసేటి పోరలం !

ఈటీవీ స్టూడియోకి వెళ్తాం
సీమ టపాకాయల్లా పేల్తాం
మాప్రేక్షకుల ముందు వాల్తాం
మానట జీవన శకఠాన్ని తోల్తాం!

తోటి నటులతో కలిసి మెలిసి ఉంటాం
వారి హావభావముల పరిశీలిస్తుంటాం
వారి పాత్రాఔచిత్యాన్ని గమనిస్తుంటాం
మా నటనను పోల్చుకొని తీర్చిదిద్దుకుంటాం!

మేం సీరియల్స్.లో కూడా నటిస్తుంటాం
మా ఏరియాల్లో మీటౌతుంటాం 
కెమెరాలతో షూట్ చేపిస్తుంటాం
తగిన పోజులు మేం ఇస్తుంటాం !

దర్శకుల సూచనలను పాటిస్తాం
వారు కోరిన విధంగా నటిస్తాం
నభూతో న భవిష్యత్త్ అనిపిస్తాం
వీక్షించే ప్రేక్షకులను ఇక మెప్పిస్తాం!

కవిత్వమన్న కళలన్న మాకిష్టం
వాటికై పడతాం ఎంతైనా కష్టం
మాకు కూడా కలుగొచ్చు నష్టం
అని మేం చేస్తున్నాం ఇకస్పష్టం !

యాంకర్లుగా కూడా మేం పనిచేస్తాం
బ్యాంకర్ల్,గా మారి పెట్టుబడి ఇస్తాం
ఊరూరా పెడతాం మేమిక సెలక్షన్లు
ఊరుతూ వచ్చిపడతాయి కలక్షన్లు

పెట్టుబడి పెట్టినవారిని సెలెక్ట్ చేస్తాం
వారితో నటింపజేసి సీరియల్స్ తీస్తాం
ఇక కురుస్తుందిలే మాకు కనక వర్షం
పెట్టుబడిదారులందరికి కలుగు హర్షం !

సీరియస్,గా మేము ఆలోచిస్తాం
సీరియల్సకు ఇక మాటలు రాస్తాం
ఇక పాటల పేరడీలు కూడా చేస్తాం
చిత్ర జగత్తుకు కొత్త దారులు తీస్తాం 



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం