అందమైన కట్టడం;-నూతన్ కుమార్,9వ, తరగతి,జి.ప.ఉ.పాఠశాల,అమడబాకుల,వనపర్తి జిల్లా.
 ఈమధ్య నేనో విషయం చదివాను. అదినాకు నచ్చిన ప్రదేశం, నాకు చాలా ఇష్టమైన ప్రదేశం అదే తాజ్ మహల్. ఇది ఒక అత్యద్భుతమైన కట్టడం. ప్రపంచంలో ఇంత అందమైన కట్టడం మరెక్కడా లేదు. కాబట్టి ఇది ప్రఖ్యాతి పొందినది కేవలం సౌందర్యానికే కాక ప్రేమకు చిహ్నంగా మిగిలిపోయింది. ఈ తాజ్ మహల్ ను మొగల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది. ఆమె ఎవరో కాదు ముంతాజ్ . ఈమె షాజహాన్ మూడో భార్య. ఈ తాజ్ మహల్ పాలరాతితో నిర్మించబడింది. ఇలాంటి నిర్మాణం భారత దేశంలో తప్ప మరెక్కడా లేదు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్శనీయ ప్రదేశం, పర్యాటక ప్రదేశం తాజ్మహల్ కు నిర్మించబడిన స్తంభాలు, ఆ కట్టడం, ప్రకృతి విపత్తుకు ధ్వంసం కాకుండా నిర్మించారు. ఈ నిర్మాణాన్ని సపోర్ట్ చేసే నాలుగు స్తంభాలు కూడా బయటకు వాలి ఉంటాయి. తాజ్ మహల్ నిర్మాణానికి ఆసియా ఖండంలోని వివిధ ప్రదేశాల నుండి అనేకమైన విలువైన రాళ్లను తెప్పించారు. ఇందుకు జపాన్ నుండి మార్బల్స్, పంజాబ్ నుండి మరియు టిబేట్ నుంచి నీలపురాయి, ఆఫ్ఘనిస్తాన్ నుండి లపీస్ 
లౌజాలి,  శ్రీలంక నుండి చైనా నుండి క్రిస్టల్స్ తెప్పించడం జరిగింది. తాజ్ మహల్ నిర్మాణంలో 4 సూత్రాలు ఆచరించారు. పర్షియన్ తుర్క ఇండియన్ మరియు ఇస్లామిక్ స్టైల్ అన్ని కలిపి తాజ్ మహల్ నిర్మాణం ఏర్పడింది. అద్భుత నిర్మాణంలో పాల్గొనిన పనివారల చేతులను నరికి వేయమని, మరియు మరల వారు వేరే ఏ ఇతర ప్రదేశంలోనూ ఇటువంటి అద్భుత నిర్మాణం చేయరాదని ఆజ్ఞాపిస్తూ షాజహాన్ ఆజ్ఞలు జారీ చేశాడు. ఫలితంగా తాజ్ మహల్ నిర్మించిన పనివారలు తమ చేతులను సైతం పోగొట్టుకున్నట్టు చెబుతారు. కథనాల మేరకు యమునా నదికి ఆవలి ఒడ్డున తాజ్ మహల్ ను నలుపు రంగులో నిర్మించుకోదగినట్లు కూడా చెబుతారు. అయితే తన కుమారుడు ఆయనను చెరసాలలో పెట్టిన కారణంగా షాజహాన్ ఏ పని చేయలేకపోయాడు. ఆగ్రాలోని తాజ్ మహల్ మారకుండా నిర్మాణం లోపల ఉంచిన షాజహాన్ మరియు ముంతాజ్  రెండు సమాధులు సమరూపం తలను ఒకే విధంగా నిర్మించబడింది. చక్రవర్తి, ఆయన భార్య ముంతాజ్ మహల్ సమాధులు ప్రజలకు బయటకు కనబడవు. సందర్శకులు చూసే ప్రాకారము లోపలి భాగంలో అవి ఉంటాయి. ఈ సమాధులు ఉపరితలం నుండి ఏడు అడుగుల లోతులో ఉంది. ఒక మెటల్ డోర్ లో లాక్ చేయబడి ఉంటాయి. నిర్మాణం యొక్క మెయిన్ డోర్ పై కురాన్ లోని శ్లోకాలు ఉంటాయి. ముంతాజ్ ఇరుపక్కల 9 పేర్లు చెక్కారు. ఇది ప్రపంచ వింతలలో ఒకటి. దీన్ని చూడాలని నా కోరిక.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం