మనసుల మధ్య దూరం తగదు;-- యామిజాల జగదీశ్
 ఎవరిమీద మనకు కోపమో వారితో అరుస్తూ గొడవపడతాం. లేదంటే మిట్లాడకుండా ప్రశాంతంగా ఉండిపోతాం. కానీ ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఎవరిమీద మనకు కోపం వచ్చినా వారు మన ఎదుటేగా ఉంటారు. అయినాసరే, ఊరంతటికీ విన్పించేలా అరుస్తాం. నెమ్మదిగా చెప్పవలసింది చెప్తే వారికి వినిపిస్తుంది. ఇలా అన్నానే కానీ నేనూ ఎప్పుడూ ఆలోచిఉచలేదిట్టా. చీటికీమాటికీ కోపం వచ్చే నాకోపానికి మొదట్లో కొన్నిరోజులేమన్నా బాధపడిందేమో కానీ తర్వాత్తర్వాత పట్టించుకోవడం మానేసింది నా భార్యామణి. దాంతో చేసేదిలేక నన్ను నేనే గొణుక్కోవడం చేసేవాడిని. ఆ గొడణుగుడూ ఎలా వినేదో వినేసి ఎందుకొచ్చిన గొడవ ? అనేదేదో అనేసే పైకే అంటుంది తను. అటువంటప్పుడు సిగ్గేసేది. అది అటుంచి
ఓ కథలోకెళ్దాం....
ఓ గురువు గంగలో స్నానమాడి తీరానికొచ్చే వేళ. ఆ సమయంలో ఓ కుటుంబసభ్యులు ఒకరికొకరు పెద్దపెద్దగా తిట్టుకుంటున్నారు. 
ఆ అరుపులను విన్న గురువు తమ శిష్యులవంక చూసి ఓ నవ్వు నవ్వి అడిగారు "ఎందుకు మనుషులు కోపంలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఇలా అరుచుకుంటారు?" అని!
శిష్యులు కాస్సేపు ఆలోచించారు. అనంతరం...
శిష్యులలో ఒకడు "కోపావేశంలో మన ప్రశాంతతను కోల్పోతాం. సహనాన్ని కోల్పోతాం. అందుకే అరుచుకుంటాం" అననాడు.
అంతట గురువు "కానీ నీ ఎదుటే ఉన్న వ్యక్తితో గొంతెత్తి అరవడమెందుకు? ఆ మనిషి ఎక్కడో కంటికి కనిపించనంత దూరంలో లేడుగా? కనుక నువ్వేం చెప్పదలచుకున్నావో అది స్థిరంగా చెప్పొచ్చుగా. వినిపిస్తుంది" అన్నారు.
ఒక్కో శిష్యుడూ ఒక్కో కారణం చెప్పాడు.
కానీ ఏ కారణంతోనూ మరొకరు ఏకీభవించడం లేదు. 
చివరగా గురువు ఇలా చెప్పారు....
ఎప్పుడైతే ఇద్దరు మనుషులు ఒకరిమీద ఒకరికి కోపం వస్తుందో అప్పుడు వారి మనసులు బహుదూరానికి పోతాయి. కనుక దూరాన ఉన్న మనసుకి వినిపించాలని అరుస్తారు. మనసెంత దూరాన జరిగిందో వారు అంతమేరకు తాము చెప్పాలనుకున్న మాటలను అరుస్తూ చెప్తారు. అప్పుడేగా వారి మాటలు అవతలి మనసుకి చేరుతాయి. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు ఏమవుతోంది? వారు ఒకర్నొకరు అరుచుకోరు.ప్రశాంతంగా ప్రేమగా తమ అభిప్రాయాలను చెప్పుకుంటారు. కారణం, వారి మనసులు రెండూ అత్యంత సమీపంలో ఉండటమే. మనసుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. లేదా మనసులు రెండూ పెనవేసుకునే ఉంటాయి.
ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ఎక్కువైతే ఏం జరుగుతుంది? వారు పరస్పరం గొంతెత్తి అరుచుకోవలసిన అవసరముండదు. ఇద్దరూ నవ్వుతూ తమ మనసులోని మాటలను ఎంతో అభిమానంతో హృదయపూర్వకంగా పంచుకుంటారు. ప్రేమాభిమానాలు మరింత ఎక్కువైతే మాటలే అవసరమవదు. వారి కళ్ళు మనసులోని మాటలను అర్థం చేసుకుంటాయి. 
ఇలా ఎన్నో మాటలు చెప్పాక గురువు "
మీరు వాదించుకునేటప్పుడు మీ మనసులు దూరం కాకుండా చూసుకోండి. మనసులను దూరం చేసే మాటలను ఉపయోగించకండి.
 అలా చేయకుంటే క్రమంగా మీ మనసుల మధ్య దూరం పెరిగి చివరికి దగ్గరయ్యే అవకాశమే లేకుండా పోయి చూసుకోవడానికి సైతం ఇష్టం లేనంత  దూరమైపోతారు. అది మనసుకి మంచిది కాదు. వీలైనంతవరకూ సదవగాహనతో ప్రేమాభిమానాలతో అన్యోన్యంగా ఉండండి" అని సూచించారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం