సమయపాలన!అచ్యుతుని రాజ్యశ్రీ

 పగటి మాటలు పనికిచేటు రాత్రి మాటలు నిద్రకు చేటు అని సామెత. బడికి ఆఫీసు కి టైంప్రకారం వెళ్లి తీరాలి. పెళ్లి పేరంటాలకు కాస్త అటుఇటు ఐనా ఫర్వాలేదు. చేతిలో ఫోన్ వల్ల కొందరు గంటలు గంటలు సుత్తికొడుతూ మన బుర్ర తింటారు.మన టైం వేస్ట్ చేస్తారు.అది చాలా తప్పు!
ముర్షిదాబాద్ నవాబు ముర్షిదా ఖాన్ ప్రతిదీ సరియైన టైమ్ లో చేస్తూ ఇతరుల చేత చేయించేవాడు. ఆటైంకి పనిపూర్తి చేయనివాడిని శిక్షించేవాడు.రైతు తన పంటలో1/4వంతు పన్ను కింద కట్టి తీరాల్సిందే అని హుకుం జారీ చేశాడు.ఎక్కువ పండినా తక్కువ పండినా ఇచ్చి తీరాలి. పన్ను కట్టనివారిని దండించేవాడు.రైతులు పన్ను ఠంచన్ గా కట్టేవారు. అఫ్జల్ ఖాన్ షెహనాయి వాయించేవాడు.తెల్లారగానే ఒకే టైంకి షెహనాయి వాయించగానే నవాబు జనానాతో సహా ప్రజలంతా పడకలువీడి పనుల్లో చొరబడేవారు.అది శీతాకాలం!ఖాన్ కి విపరీతమైన జ్వరం!కన్ను చేయికాలు పనిచేయని స్థితిలో పాపం షెహనాయి వాయించలేకపోయాడు.జనం ఆలస్యంగా నిద్రలేచారు.అంతే నవాబు అతన్ని పిల్పించి"నీవు షెహనాయి వాయించకపోటంతో జనం ఇష్టం వచ్చినట్లు నిద్రలేచారు.అస్తవ్యస్తంగా పనులు చేస్తున్నారు. "అని హమీద్ ఖాన్ చేత కొరడాదెబ్బలు కొట్టించాడు."నీకు శిక్ష వేయకపోతే నన్ను ఎవరూ ఖాతరు చేయరు"అన్నాడు.
50కొరడాదెబ్బలతో అతని శరీరం నుజ్జు నుజ్జు ఐంది. ఆరోగ్యం బాగుపడ్డాక ఖాన్ షెహనాయి తో అందరినీ మేలుకొలుపుతూ తన విధి నిర్వహిస్తున్నాడు.ఓరోజు నవాబు నిద్ర లేవలేదు.ఎప్పటికో మెలుకువ వచ్చింది. హమీద్ ఖాన్ ని పిల్చి అందరిముందూ  తన అంగీ విప్పి"నా వీపుపై 50కొరడాదెబ్బలు వేయి"అని  ఆజ్ఞాపించాడు. దర్బార్ జనం మంత్రులు ఎంత మొత్తుకున్నా ససేమిరా అన్నాడు. "నేను పెట్టిన నియమాలు నేను పాటించితీరాలి."హమీద్ కొరడా ఛెళ్ల్ ఛెళ్ల్ అని మోగింది.అంతే ఆరాజ్యంలో ఎవరూ తప్పు చేయాలంటే భయపడేవారు.నవాబు చనిపోయాక గూడా అతని నిబద్ధత ను గూర్చి జనం చెప్పుకునే వారు 🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం