మన జాతీయ పతాక రూపకర్త...;-చంద్రకళ. దీకొండ,స్కూల్ అసిస్టెంట్,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
 పందొమ్మిదో ఏటనే సైన్యంలో చేరి బోయర్ యుద్ధంలో పాల్గొన్న ఉద్యమ కర్త!
సంస్కృత,ఉర్దూ,జపాన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించి "జపాన్ వెంకయ్య"గా పేరు తెచ్చుకున్న మేధావి...
ప్లేగు ఇన్స్పెక్టర్ గా,రైల్వే గార్డుగా వృత్తులు నిర్వహించిన నిరాడంబరుడు!
పత్తి,మైకా,వజ్రాలపై పరిశోధనలెన్నో చేసి ఎనభై రెండేళ్ల వృద్ధాప్యంలో ఖనిజ పరిశోధనా సంస్థకు సేవలందించిన నిరంతర పరిశోధకుడు...
ఏ పదవీ ఆశించని నిస్వార్థ సేవకుడు!
కాషాయం, ఆకుపచ్చ వర్ణాలు మతాలకు ప్రతీకలని ఎంచి
సత్యం అహింసలకు గుర్తుగా తెలుపు రంగును నిలిపిన అహింసావాది!
కార్మిక కర్షకులపై ఆధారపడిన దేశం సత్యాహింసలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షించిన సుమనస్కుడు!
గ్రామజీవనం,రైతు కార్మికత్వాన్ని ప్రతిఫలింపజేస్తూ పతాకం మధ్యలో రాట్నాన్ని చిహ్నంగా నిలిపిన రైతుబంధు!
ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో తన పేరును సూచించకున్నా...
చివరి దశలో ఇడుములెన్నో పడినా...
ఎవ్వరినీ దూషించని
సౌమ్యమూర్తి!
చివరి కోరికగా భౌతికకాయంపై జాతీయజెండాను కప్పమని కోరిన దేశభక్తి పరాయణుడు!
ఎగురుతున్న జెండాలా జనం గుండెల్లో కలకాలం నిలిచి ఉండే పింగళి వెంకయ్య!!!
*************************************


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం