*చిటికెనకు ఆచార్య జయశంకర్ స్మారక పురస్కారం*

 తెలంగాణ స్ఫూర్తి ప్రదాత మరియు ఉద్యమ వీరుడు, పోరాట యోధుడు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా ఇటీవల సాహితీ బృందావన జాతీయ వేదిక నిర్వహించిన కవితా పోటీలలో ఉత్తమ కవిత అందించిన ప్రముఖ కవి, రచయిత పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు, ఎడిటోరియల్ కాలమిస్ట్ డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఎంపికయినందున ఆచార్య జయశంకర్ స్మారక  పురస్కారాన్ని అందజేస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, సున్నితం ప్రక్రియ సృష్టికర్త నెల్లుట్ల సునీత తెలియజేశారు. ఈ సందర్బంగా నెల్లుట్ల సునీత మాట్లాడుతూ వ్యాసాంగ రచనల ద్వారా  అంతర్జాతీయంగా దూసుకుపోతున్న డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు పురస్కారం అందజేయడం  హర్షించదగ్గ విషయం
అని అన్నారు. పురస్కార  గ్రహీత చిటికెన మాట్లాడుతూ 
   ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నప్పటికీ ఆచార్య జయశంకర్ పురస్కారం అందుకున్నందుకు ఎంతో  ప్రత్యేకంగా  ఉందని సంతోషాన్ని వ్యక్త పరచారు. 
  ఈ సందర్బంగా   పలువురు ప్రముఖులు చరవాణి ద్వారా చిటికెన కు అభినందనలు అందించారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం