జయభర్తకి బెంగళూరు తబాదలా అయింది. మహాఎగిరి గంతేసింది. గార్డెన్ సిటీ లో కాపురం!ఏంమజాలే హలా!?మైసూరు బృందావనగార్డెన్స్ మైసూరు వేడివేడి బోండాలు ..కలల అలల్లో తేలిపోతోంది.కన్నడ కస్తూరి అని ఆభాషకు పేరు. లిపి కూడా దాదాపు తెలుగు లిపి! చదవటం తేలిక. కాకపోతే పదాల అర్థం తెలియాలి. బెంగళూరు లో జయ వాళ్ళ అపార్ట్మెంట్ లో అంతా కొంకణీవాళ్లే!అస్సలు అర్ధం కాదు. ఇంగ్లీష్ హిందీ కలగాపులగం చేసి మాట్లాడుతోంది.ఆరోజు టి.వి.దీక్షగా చూడసాగింది. కన్నడ సినిమా మూగసినిమా లా అనిపిస్తున్నా కథ అర్థం అవుతోంది. "ఈగ నమ్మ కేంద్ర " అక్షరాలు చూసి ఉలిక్కిపడి మధ్య లో ఈగ ఎలా దూరిందాఅని తన తలతిక్క ఆలోచన లను బరికింది. కుప్పలుతెప్పల వాన మబ్బుల్లా కపిత్వం ఆమెలోంచి తన్నుకుని పొడుచుకుని బైటికి వస్తుంటే ఆమె భర్త "ఆపు నీ శివాలు!వాయి ముడు.బాయ్ ముచ్ కై కట్ "అని గర్జించాడు."అంటే ఏంటి సారూ!పప్పుచారూ?"నోరుముయ్యి. చేతులు కట్టు నోరుకుట్టు"ఒకేసారి తమిళ కన్నడతో తెరుచుకున్న ఆమె నోటి కి తాళం వేశాడు. ఇంతకీ జయకి ఈగ అన్న పదంకి అర్ధం తెలీలేదు.ఎలాగైతేనేమి కొండను త్రవ్వి ఎలుక ను పట్టింది. ఈగ అంటే ‘ఇప్పుడు ‘ అని తెలుసుకున్నాక ఆమె కడుపు ఉబ్బరం తీరింది. ముప్పై రోజులలో కన్నడభాష పుస్తకం పుణ్యమా అని కొన్ని పదాల అర్థాలు తెలుసుకుంది. వాకిలి ముందు నించున్న అవ్వ గొంతు చించుకుని "అమ్మా!తరకారీ. ..సొప్పు. బేకా?" ఈ బేకు సాకు చాకు ఏంటీ?సొప్పు ఏంటీ పప్పు లాగా? పక్కింటి ఆమె ఎష్టు అని తొగో హత్తు రూపయా అని పదిరూపాయల నోటు చేతిలో పెట్టింది. "బాళేహన్ను తొగో"అని పండబారిన నాల్గు అరటిపళ్ళు చేతిలో పెట్టింది.
నాల్గు అరటిపండ్లు చేతిలో పెట్టింది.ఆపై తట్టి నెత్తిన పెట్టుకొని"సొప్పో సొప్పు"అని వెళ్లి పోయింది.సొప్పు అంటే ఆకుకూరలు అని అర్థం అయింది.బేడ అంటే వద్దు అని సాకు అంటే చాలు అని బా అంటే రమ్మనమని హోగు అంటే వెళ్లు అని వాటి అర్ధాలు తెలుసు కుంది.అవసరం ఉన్న లేకున్నా ఆపదాలు వాడుతూ రోజూ భర్త జుట్టు పీక్కునేలా చేస్తోంది.పాపం! మానవుడు నోరెత్తడు.ఏమన్నా అంటే వంటి మానేస్తే తన గతి ఏమిటి ?అసలే కరోనా రోజులు! బైట తినాలంటే హడల్! తిరుపతి వెళ్లకుండానే తన తలని నున్న గా చలిమిడి ముద్ద చేస్తోంది అని నెత్తి కొట్టుకోవడం మొదలు పెట్టాడు.కానీ ఒకరోజు "ఏంటోయ్! ఇంట్లో అప్పడాలకర్ర ప్రయోగం జరిగిందా?బొప్పికట్టింది తల దగ్గర"అని ఫ్రెండ్ అడిగితే"కిటికీ తలుపు కొట్టుకుంది.అక్కడ కూచుని పేపర్ చదివి హఠాత్తుగా లేచాను"అని చెప్పాడు.హు..ఇక లాభంలేదు.తెలుగు రాష్ట్రంకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అని దృఢనిశ్చయానికి వచ్చాడు.(ఇది సరదాగా రాసిన కథ.ఎవరినీ కించపరిచే ఉద్దేశం కాదు.) అచ్యుతుని రాజ్యశ్రీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి