వెన్నెల ముత్యాల హారాలు పుస్తకావిష్కరణ

 ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ముత్యాల హారం ప్రక్రియలో  వెన్నెల-ముత్యాల హారాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉట్నూరులోని సాహితీ వేదిక కార్యాలయంలో జరిగింది.నాగర్ కర్నూల్ జిల్లా  కల్వకుర్తి వాస్తవ్యులు రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గౌ,
శ్రీ, గుర్రాల లక్ష్మారెడ్డి  రచించిన   వెన్నెల ముత్యాల హారాలు పుస్తకాన్ని రూపకర్త. కవి, రచయిత ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు శ్రీ,రాథోడ్ శ్రావణ్ సారథ్యంలో ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన  గౌ, శ్రీ, రాథోడ్ భీం రావు మాట్లాడుతూ సాహితీరంగంలో "ముత్యాలహారం" అనే ప్రక్రియ అనేక మంది కవులు గొప్ప వరమని కొనియాడడం జరిగింది. ఉసావే పూర్వ అధ్యక్షులు డాక్టర్ మెస్రం మనోహర్ గారు మాట్లాడుతూ ఉట్నూరు నుండి  ఈ సాహితీ ప్రక్రియ వెలువడి సాహితీరంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనం సృష్టించడం గొప్ప విషయమని వారు అన్నారు. ఉసావే అధ్యక్షులు కవన కోకిల జాదవ్ బంకట్లాల్ మాట్లాడుతు ముత్యాల హారం అనే ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఎనిమిది పుస్తకాలు వెలువడడం శుభ సూచకమని కొనియాడుతు ఉట్నూరు కవులు కూడా ఈ ప్రక్రియలో కవితలు రాసి పుస్తకాల రూపంలో తీసుకురావాలని అలాంటి కవులకు ఉసావే ద్వారా సహకారం అందిస్తామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉసావే పూర్వ అధ్యక్షులు కట్టా లక్ష్మణ చారి, ప్రధానకార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్, సాహితీ అభిమాని జాదవ్ వసంత్ రావు, కవులు
 భట్టుశ్రీ మురళీ జాధవ్, ప్రచార కార్యదర్శి ఆత్రం మోతీరాం, దేవావత్ ధరంసింగ్, సాకివార్ ప్రసాంత్ కూమార్,
పవార్ వినోద్, చౌహాన్ పరమేశ్వర్, చౌహాన్ గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..
కామెంట్‌లు