తెలివి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనకు తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి ఉండాలి. అప్పుడే రాణిస్తాం.టీచర్ ఓకథ చెప్పింది " ఓరాజు తన సభలో వారికీ  మూడు ప్రశ్నలను ఇచ్చి జవాబు చెప్పమన్నాడు.1 .ప్రపంచం దేనిపై ఆధారపడి ఉంది?2సంతానం పుత్రులు లేని వారికి  సద్గతి ఎలాకలుగుతుంది?3 ఉంగరంలోపలినుంచి నీవు దూరి ఎలాబైటకి రాగలవు? పిల్లలూ!మీరు ప్రయత్నించండి"
పిల్లలు అంతా తెల్లమొహాలు వేశారు. శివా లేచి" టీచర్!ఈకథని మా అమ్మమ్మ చెప్పింది.మొదటిప్రశ్నకి జవాబు ప్రపంచం సత్యంపై ఆధారపడి ఉంటుంది. సంతానం పుత్రులతో సద్గతి కలగదు.అది శుద్ధ తప్పు. మనం చేసే పాప పుణ్యాలే మనవెంట వస్తాయి. అదే సద్గతి కలిగిస్తుంది. "తనపేరు కాగితం పై రాసి శివా " టీచర్!మీవేలి ఉంగరం బైట కి తీయండి " అని ఆకాగితంని ఉంగరం లో పెట్టి  అవతలివైపు నించి బైటికి తీశాడు. క్లాస్ అంతా చప్పట్లతో మార్మోగింది. పెద్దల దగ్గర కథలు వినాలి.స్వయంగా పుస్తకాలు చదవాలి అని టీచర్ వారికి చెప్పింది. 🌷
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం