* కురిపించుముతండ్రీ * కోరాడ నరసింహా రావు !

 స్వతంత్రాన్ని... గణతంత్రంగా రూపొందించి..., ప్రజలను... 
ప్రజలే ప్రభువులై ఏలుకునే... 
 ప్రజాస్వామ్య విధానం... !
   అంబేద్కర్ తొ సహా... 
  అభ్యుదయవాదులందరూ... 
 కలిసి రూపొందించుకున్న... 
    రాజ్యాంగం.... !!
 ఐనా...మారని అధికారం తీరు
  తెన్నులు... !
   అబలలు, బలహీనులు... 
  అన్యాయాలకూ,దౌర్జన్యాలకు 
బలైపోతున్నా... ఆదుకోలేని చట్టాలు -  శాసనాలు... !!  
అందరూసుఖపడతారనుకుంటే
 అది కొందరికే సొంతం... !
  పరాయి పీడను వదిలించు కున్నా ...సొంతచీడ... పీడలా పట్టి వదలకున్నది... !
ఎన్ని సవరణలు చేసినా.... 
ఏదో ఒకఅడ్డదారి,వెక్కిరిస్తూనే 
 వున్నది... !
 అధర్మం  గర్వంతో... కాలరెగరే స్తూనే వున్నది... !!
 ఇన్నిన్ని సమస్యలతోసతమత 
 మైపోతుంటే... 
 గోతికాడినక్కల్లా...సరిహద్దుల్లో
.పొంచిఉన్న శత్రుమూకలు !
 హఠాత్గావిరుచుకుపడుతున్న 
  వైరస్ లు.... !!
   ఎన్నెన్ని సవాళ్లు... !
,ఓ... సర్వేశ్వరా.... !
     వీటన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కొని, ప్రజలకు సుఖశాంతులు కలిగే పాలనాసామర్ద్యాన్ని మా పాలకులకు దయతో  ప్రసాదించి నీకృపావర్షమును 
మా భారతావనిపై సమృద్ధిగా కురిపించుము  తండ్రీ..... !
     ******
కామెంట్‌లు
రాజు నాయక్ చెప్పారు…
చాలా బాగా రాశారు మాష్టారు