సంభాషణ మాధుర్యం-;- తాటి కోల పద్మావతి


=ఆకాశంలో ప్రయాణం చేస్తున్నా ఒక హంసకు కొన్ని కొంగలు ఎదురైనాయి. అవి హంసను నిలదీస్తున్నట్లుగా ప్రశ్నలు వేస్తున్నాయి. హంస సహనంతో సమాధానం ఇస్తూ ఉంది. ఎలాగో చూడండి-

ప్రశ్న: ఎవడ ఓరి కాళ్లు మొగ మెర్రన?

సమాధానం: హంసను.

ప్రశ్న: యందు నుందువో?

సమాధానం: దవ్వుల మానసంబునను.

ప్రశ్న: దాన విశేషములేమీ తెలుపుమా?

సమాధానం: మవ్వపు కాంచనాభ్యములు మౌక్తికముల్ గల వందు.

ప్రశ్న: నత్తలో?

సమాధానం: అవి ఎరుంగము.

ఇంతకు మాటల్లా కనిపించే పై ప్రశ్నలు, సమాధానాలు నిజానికి ఒక చాటుపద్యంలోనివి. సుమండీ. చూడండి.

లోకంలో తమకు తెలిసిందే గొప్పది అనుకుంటారు కొందరు. వారు ఎదుటి వాళ్లలో ఎంత గొప్ప విలువ ఉన్నా లెక్క చేయరు. పై పెచ్చు హేళన చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. మానస సరోవరంలో నివసిస్తూ, తామర తూడులు ఆహారంగా తీసుకునే హంస ఎక్కడ?

నత్తలు తినే కొంగ ఎక్కడ? కానీ హంస తనకు నత్తలేమిటో తెలియదనగానే కొంగలన్నీ విరగబడి నవ్వినాయి. తొలుత పలకరించేటప్పుడు కూడా'ఏరా? ఎర్రమూతోడా? అనే వెటకారంగా పిలిచాయి. పాలను నీటిని వేరు చేసే హంస లాంటి గుణవంతులైన వారిని మనం ఆటపట్టించాం అనుకోకూడదు. జ్ఞానుల్ని గౌరవించడం మన భారతీయ సనాతన సంప్రదాయం. చక్కని నీతిని పక్షుల ద్వారా చెప్పిన కవితా మాధుర్యం ఇక్కడ కనిపిస్తుంది.


కామెంట్‌లు