ఋషులు-జమదగ్ని మహర్షి.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 రుచేక మహర్షి, సత్యవతుల పుత్రుడు జమదగ్ని మహర్షి. రుచే కునే తపః ప్రభావం చేత రెండు యజ్ఞ ప్రసాదములు సృష్టించబడి ఆ ప్రసాదముల ప్రభావం చేత సత్యవతిని జమదగ్ని, సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు పుట్టారు. జమదగ్ని భార్య రేణుక. జమదగ్ని రేణుకల పుత్రుడు పరశురాముడు. జమదగ్నిని కర్తవీర్యార్జునుడు తపస్సులో ఉండగా సంహరించాడు. కానీ బృగు మహర్షి తపః ప్రభావం చేత ఆయన పునర్జీవుడు అయ్యాడు. పరశురాముడు ఈ కారణం చేత కార్త వీర్యార్జునితో పోరి అతనిని సంహరించాడు. ఆ కక్షతోనే కార్త వీర్యార్జుని పుత్రులు జమదగ్ని హోమ గృహంలోనే సంహరించారు. ఆ సమయంలో'పరశురామ నీ తండ్రిని రక్షించు"అని 21 సార్లు రేణుకాదేవి రోదించినది. అందుకోసమే పరశురాముడు 21 సార్లు భూమి మొత్తం తిరిగి క్షత్రియ సంహారం చేశారు. జమదగ్ని సప్తర్షులలో ఒకరు.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం