ఆదర్శ- వ్యక్తి రంగారెడ్డి (3);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అప్పుడు భారత పార్లమెంటుకు హైదరాబాద్ సంస్థానం నుంచి 25 మంది సభ్యులను నియమించింది వారిలో రంగారెడ్డి గారు  ఒకరు కావడం విశేషం  1948లో వినోభా గారు పోచంపల్లిలో ప్రారంభించిన భూదాన యజ్ఞంలో మొదటి సమిధగా మొట్టమొదటిగా  ముందంజ వేసి 100 ఎకరముల భూమిని త్యాగము చేసిన ఘనుడు  వెదిరే రామచంద్రారెడ్డి గారి పేరు భారత దేశ చరిత్రలో స్థిరంగా ఉండిపోయింది  ఆ భూమి పంపిణీ పై నిస్వార్థపరుడు ప్రజల ఆశాజ్యోతి రంగారెడ్డి గారి పేరుతో  వారిని అధ్యక్షుడిగా చేసి ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు తెలంగాణలో అల్లుకుపోయిన భూదాన విజయం రాజకీయాలతో మునిగి తేలుతున్న నెహ్రూ గారిని సైతం ముగ్ధున్ని  చేసింది. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శంషాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రంగారెడ్డి గారు  బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఎక్సైజ్ కస్టమ్స్ అటవీశాఖ మంత్రిగా పనిచేశారు  1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించింది డాక్టర్ నీలం సంజీవరెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రథమ మంత్రివర్గంలో  రంగారెడ్డి గారు హోంశాఖ మద్య నిషేధశాఖ నిర్వహించారు. ఆ తర్వాత రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు. 1965 జూన్ లో రంగారెడ్డి గారి జన్మదినోత్సవం  నాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు గారు రంగారెడ్డి గారిని ఉత్తమ మిత్రునిగా  అగ్రగామి సహచరునిగా స్వచ్ఛమైన ఆలోచన కలవానిగా ప్రజాసేవకుడిగా తెలంగాణ దృష్టికి అనేక సాంఘిక  విద్యా విషయక సంస్థల స్థాపనకు కారణభూతమైన వారిగా చేసిన ప్రశంసా వాక్యాలు వాస్తవికాలు. నిజాయితీపరుడు కాంగ్రెస్ వాదులకు ఆదర్శ పురుషుడు నేషనల్ అని  డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారిచే పొగడపడిన ఘనుడు  మంత్రిగా వారు ఫైళ్ళ పై ఇచ్చే ఉత్తర్వులు బాగా విచారించి తీసుకునే తీర్పుగా ఉంటాయి  వారు చేసే తీర్పులు హైకోర్టు జడ్జి తీర్పులాగా ఉండును అని మాజీ ముఖ్యమంత్రిగా సంజీవయ్య గారు చేసిన వ్యాఖ్య  వారికి న్యాయవాద వృత్తిలో గల నాయకుడు మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు ఏ కోణంలో తోడ్పడిందో చెప్పకనే చెప్తున్నాయి  అంతేగాక పెద్దలు ఆత్మీయ  వాక్యములు తెలుసుకొనడంతో పాటుగా వారి ఆశయ సాధనకై కృషి చేసిన వారు స్వీయ చరిత్ర రాసినందుకు అర్థం పరమార్థం చేకూర గలదు  అన్న విషయం వీరి  జీవిత చరిత్ర వల్ల మనకు తెలుస్తుంది.




కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం