రెడ్డి రాజులు (9);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 దశరథ మహారాజునకు  మూడవ భార్య  ఎంతో ఇష్టంతో చేసుకున్న వివాహం  ప్రపంచానికే మార్గదర్శకుడైన భరతుడు  కైక కుమారుడు కైక అంటేనే క ఏక  నేను తప్ప మరొకరు లేరు అన్నది ఆ శబ్దానికి అర్థం  నిజ జీవితంలో కూడా  తన స్థానం ప్రథమంలో ఉండాలి అని కోరుకునేది  తనకు ఎవరూ ఎదురు నిలవడానికి వీలు లేదు  అంత మాత్రం చేత కర్కశ హృదయురాలు కాదు.  శ్రీరామచంద్రుడు జన్మించిన తరువాత  అప్పటికి తాను తల్లి కాకపోయినా ఆ బిడ్డను తన సొంత బిడ్డగా చూసుకొని  ఎంతో గారంగా పెంచిన తల్లి  మాతృ హృదయం కైకకు తెలిసినట్లుగా మరెవరికి తెలియదేమో రాముణ్ణి అరణ్యవాసానికి పంపినది చిన్న తల్లి  కైకమ్మ అని తెలిసిన తర్వాత కూడా.14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకుని  రాజ్యానికి తిరిగి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి తిన్నగా కైక ఇంటికి వెళ్లి  అమ్మ ఎలా ఉన్నావు  అని క్షేమ సమాచారాలు  తెలుసుకొన్న మహాయోగి పుంగవులు శ్రీరామచంద్రమూర్తి. ఎదుటివారిలో తప్పులు వెతికి  వారు చేసిన మంచి పనులను మరిచిపోవద్దు అని చెప్పడం కోసం వాల్మీకి మహర్షి దానిని ధర్మంగా మన ముందుకు తీసుకువచ్చారు. ఇలాంటి ధర్మ సూక్ష్మాలు రామాయణం మొత్తం మనకు కనిపిస్తాయి  రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన గొప్ప ఉదాహరణ  శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవునకు ఇచ్చిన మాట ప్రకారం  అతని అన్న వాలిని సంహరించడం  వారు మరణించిన మరుక్షణం  శ్రీరామచంద్రమూర్తితో అన్నమాట రామా నీవెంతో ధర్మాత్ముడవు అనుకున్నాను  ఇంత అధర్మంగా ప్రవర్తిస్తావని నేను కలలో కూడా ఊహించలేదు అన్నాడు.
అదేమిటి అని రాముడు అడిగినప్పుడు  ధీరుడువై ఉండి నాతో యుద్ధం చేసి గెలవాలి తప్ప  అడ్డుపెట్టుకొని చంపిన నిన్ను  వీరుడనాలా లేక పిరికిపంద అని సంబోధించాలా అనగానేమి చిరునవ్వు నవ్వినాడు శ్రీరామచంద్రమూర్తి నీకు అలా అనిపించడం సహజం నీది జంతు ప్రవృత్తి నాది మానవ ప్రకృతి  పాత్ర ధర్మంలో  రాజులు వేటకు వచ్చినప్పుడు  క్రూర మృగాలను వేటాడడం కోసం  మాటు వేసి వాటిని కొడతారు  ఆ ధర్మాన్ని నేను పాటించాను అని చెప్పాడు  అధర్మానికి తావే లేని రామాయణ గ్రంథం  మన కందించిన వాల్మీకి మహర్షికి  ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినా  వారి రుణాన్ని తీర్చుకోగలమా  అనిపిస్తుంది  ఆ భాషలో కానీ  భావాన్ని వ్యక్తం చేయడంలో కానీ  వారి శక్తికి మరి ఎవరు  సాటిరారు అందుకని  మహాకవి ఆదికవి అని పేరు పొందారు.


కామెంట్‌లు