నీవునేర్పిన విద్యయే నీరజాక్ష.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్.988442989

  సుందరయ్య అమాయకుడు,చదువులేనివాడు . తనకుమారులు రామడు,లక్ష్మణుడులను బాగాచదివించాలని ఆశతో వారిని పట్టణంలో  ఉంచి ఉన్నత విద్య చదివించసాగాడు.పొరుగు ఊరులోని వడ్డివ్యాపారి రంగనాధం వద్ద పలు కాగితాలపై వేలముద్రలు వేసి డబ్బు అప్పుతీసుకున్నాడు.మూడేళ్ళలో సుందరయ్య పిల్లల చదువులు ముగిసాయి.ఈలోపు వడ్డివ్యాపారి రంగనాధం,సుందరయ్య పొలం కొన్నానని స్వాధినపరుచుకున్నాడు. 
రాముడికి మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగం లభించింది.లక్ష్మణుడు తండ్రికి తోడుగా కౌలు పొలంలో కాయగూరలు సాగుచేయసాగాడు.మెదటి నెల జీతం అందగానే తండ్రికి డబ్బు ఇచ్చివెళ్ళాడు  రాముడు. అందులో కొంతడబ్బు,పొలంలోని కొన్నిరకాల కూరగాయలు, తీసుకుని వడ్డివ్యాపారి ఊరు బయలుదేరివెళ్ళిన లక్షణుడు ముందుగా ఆగ్రామ పెద్ద ఆగ్రామ పెద్ద పూర్ణయ్య గారి ఇంటికి వెళ్ళి''నమస్కారం అయ్య మాది పొరుగుగ్రామం. తమ ఇంటి ఎదురుగా ఉన్న వడ్డి వ్యాపారి రంగనాథం వద్ద ఈమాసంనుండి పదివేలు దాచుకుందామని వచ్చాను''  (అని డబ్బు చూపించి).దారిలో తమవంటి పెద్దల ఆశీర్వాదం పొందాలని వచ్చాను".అని కూరగాయలుఉన్న బుట్ట అక్కడ ఉంచాడు. నమస్కరించాడు.
"నాయనా రంగనాథం తో డబ్బువిషయంలో జాగ్రత్త ''అన్నాడు పూర్ణయ్య "అలాగే" అని రంగనాథం ఇల్లు చేరి "నమస్కారం అయ్య నాపేరు లక్ష్మణుడు.మాది పొరుగుఊరు ఇవి మాపొలంలో పండినవి ఈకూరగాయలు ఉంచండి. భవిష్యత్తులొ తమవద్ద డబ్బు అవసరం పడవచ్చు అందుకని తమదర్శనం చేసుకుందామని వచ్చాను" అన్నాడు."మంచిది వెళ్ళిరా" అన్నాడు రంగనాథం.
అలా ప్రతి మాసం  పూర్ణయ్యగారికి, రంగనాథం గారికి కాయగూరలు క్రమంతప్పకుండా సంవత్సర కాలం అందించాడు లక్ష్మణుడు.  ఓక రోజు రంగనాథం ఇంటిముందు జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. రంగనాథంతో, లక్ష్మణుడు తగాదా పడుతున్నాడు. "పోవయ్య ఫో నువ్వేంటి సంవత్సరకాలంగా నావద్ద డబ్బుదాయడం ఏమిటి? ఫో" అన్నాడు ఆవేశంగా రంగనాథం."అన్యాయం ప్రతిమాసం పదివేల రూపాయలు,కాయగూరలు, మీకు ఇచ్చివెళ్ళాను" అన్నాడు లక్ష్మణుడు.అక్కడ ఉన్నజనంలో కొందరు "అబ్బాయి అందుకు సాక్ష్యం ఉందా" అన్నారు. "ఉంది రంగనాథం గారికి డబ్బు,కూరగాయలు ప్రతిమాసంఇస్తూ,వారి ఇంటి ఎదురుగా ఉన్న పూర్ణయ్య గారికి ప్రతిమాసం కనిపించి నమస్కరించే వాడిని" అన్నాడు లక్ష్మణుడు.
తన ఇంటి ముందునిలబడిన పూర్ణయ్యగారు" అవును ఇతను ప్రతిమాసం మాయింటికి వచ్చేవాడు,అనంతరం రంగనాథం ఇంటికి వెళ్ళేవాడు, రంగనాథం దగ్గర దాచడినికి తెచ్చిన ధనం ప్రతిమాసం నాకు చూపించేవాడు. రంగనాథంగారు ఇది మీకు తగదు ఇతను ప్రతి మాసం మీవద్ద డబ్బు దాయకుండా,మీకు ఊరికే కూరగాయలు ఇవ్వడానికి అంతదూరంనుండి వచ్చేవాడా? మీప్రవర్తనపై ఇప్పటికే చాలా ఫిర్యదులు ఉన్నాయి మర్యాదగా అతని డబ్బు ఇచ్చి పంపండి"అన్నాడు పూర్ణయ్య. వేరేదారిలేని రంగనాథం అందరిముందు లక్ష్మణుడికి ధనం ఇచ్చి పంపాడు.
రంగనాథం ద్వారా కోల్పోయిన తమభూమికి సమంగా డబ్బు తండ్రి సుందరయ్యకు అందించాడు లక్ష్మణుడు. 
9.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం