సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -98
దగ్ధేంధన వహ్ని న్యాయము
******
దగ్ధము అంటే కాల్చబడిన, కాలిన అని అర్థం.ఇంధనము అంటే చిదుగు లేదా వంట చెఱకు,వంటకు ఉపయోగించే కట్టెలు అని అర్థం. వహ్ని అంటే అగ్ని,పాచక శక్తి, ఆకలి అనే అర్థాలు ఉన్నాయి.
వంట కట్టెలు వంట చేయుటకు తోడ్పడి, తాము మాత్రము కాలిపోతాయి.
 సజ్జనులు కూడా వంట కట్టెల వంటి వారే. తమ నష్టమును సైతము లెక్కచేయకుండా ఇతరులకు సాయపడుతారు అనే అర్థంతో ఈ దగ్ధేంధన వహ్ని న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 సజ్జనులు అంటే మంచి మనసున్న వారు.వారి మనసు ఎంత మృదువైనదో ఈ శ్లోకంలో చూద్దాం.
"మృదులం నవనీతమీరితం నవనీతాదపి సజ్జనస్యహృత్/తదిదం ద్రవతి స్వతాపనాత్ పరతాపాద్రవతే సతాం పునః"
అంటే భావం ఏమిటో చూద్దాం.నవనీతం అంటే వెన్న.ఇది చాలా మృదువుగా ఉంటుంది.కానీ నవనీతము కంటే కూడా సజ్జనుల  హృదయము మరింత మృదువైనదనీ ఈ శ్లోకం చెబుతోంది.
 ఎందుకంటే వెన్నను వేడి చేస్తేనే కానీ కరుగదు స్వతాపనాత్  ద్రవతే.కానీ సజ్జన హృదయము పరతాపా ద్రవతే అంటే ఇతరుల తాపాలకు అనగా ఎదుటి వారి బాధలు కష్టాలనే వేడికి కూడా కరిగిపోతుంది అని అర్థం.
మరి వెన్న కరగాలి అంటే వేడి అనే కష్టాన్ని భరించాలి.అప్పుడే తన మృదుత్వం వల్ల కరిగి పోతుంది. 
కానీ సజ్జనుల హృదయ మృదుత్వం ఎంత గొప్పదంటే ఎదుటి వారి కష్టాలను చూసినప్పుడల్లా  మళ్ళీ మళ్ళీ కరిగిపోతూనే వుంటుంది.అలా ఇతరుల మేలు కోసం తాము కరిగిపోతూ జీవితాలను త్యాగం చేసేవారే సజ్జనులు అని అర్థం.
 ఇలాంటి అర్థం వచ్చేలా సజ్జనుల గొప్పతనం గురించి  భాస్కర శతక కర్త  ఏమన్నాడో చూద్దాం.
"ఉరు గుణవంతు డొర్లుదన కొండపకారము సేయునప్పుడున్/బరహితమేయొనర్చు నొక పట్టునైనను గీడు సేయగా/నెఱుగడు నిక్కమేకద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్/దరువగ జొచ్చినం బెరుగు తాలిమినీయదె వెన్న భాస్కరా!"

అంటే గుణవంతుడు లేదా సజ్జనుడు ఇతరులు కీడు చేయుచున్నను వారికి ఎప్పుడూ మంచినే చేస్తాడు.ఎలాంటి సందర్భంలోనూ అపకారము తలపెట్టడు.అదెలా అంటే కవ్వముతో పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది కానీ కోపగించదు కదా అంటారు.
అలాంటి ఉత్తమ లక్షణాలను కలిగిన వారే సజ్జనులు. సాటి వారికి సాయం  చేయడం కోసం తాము కష్టాలను,నష్టాలను భరిస్తూ త్యాగం చేయడం సజ్జనుల లక్షణమని ఈ  "దగ్ధేంధన వహ్ని న్యాయము" ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం