అతి తెలివి.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 తమఇంటి అరుగుపైన కథ వినడానికి చేరినపిల్లలు అందరికి మిఠాయిలు పంచిన బామ్మ 'పిల్లలు  తెలివితేటలు అనేవి ఏఒక్కరిసొంతంకాదు.మనం ఎదటివారిని మోసగించబోతే మనమే మోసపోఏప్రమాదంఉంది. ఎవరుతీసిన గోతిలో వాళ్ళే పడతారు అని మనపెద్దలు ఎప్పుడోచెప్పారు. ఈరోజు మీకు మోసగించడం అనేది ఎంతతప్పో తెలియజేసే కథచెపుతాను.
అవంతి రాజ్యంలోధనపాలుడు అనే కిరాణావ్యాపారి ఉండేవాడు.అతనికి చక్కటి అందమైన తెలివితేటలుకలిగిన కుమార్తెఉంది. అతని జాలిగుణాన్ని, మంచితనాన్ని అలుసుగా తీసుకుని సరుకులుఅప్పుతీసుకున్న తిరిగిచెల్లించలేదు. అలా అతని వ్యాపారం దివాలాతీసింది. తనుకిరాణా సరుకులు అప్పుతెచ్చిన షావుకారుకు ఐదువేలవరహలు బాకీపడ్డాడు.
తనకు ఇవ్వవలసిన ఐదువేలవరహలు వెంటనేచెల్లించాలి,అలా చెల్లించని ఎడల ధనపాలునికుమార్తెను తనకుఇచ్చి వివాహం జరిపించవలసినదిగా ధనపాలునిపై వత్తిడి తీసుకు వచ్చాడు షావుకారు. 
ఈవిషయం తనకుమార్తెవద్ద ప్రస్తావించాడు ధనపాలుడు. 'బాధపడకండి నాన్నాగారు ఆపదసమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి.సమస్య ఎప్పుడు కొండలాకనిపిస్తుంది ధైర్యంతో సమస్యను ఢీకొంటేనే విజయం లభిస్తుంది.శతకోతి ఆపదలకు అనంతకోటి ఉపాయాలు.నిజాయితీగా తెలివితో ఎంతటి ఆపదనైనా సునాయాసంగా ఎదుర్కొనవచ్చు సమయం వచ్చినప్పుడు వచ్చిన ఆపదకు తగిన ఉపాయం ఆలోచిద్దాం'అన్నది.
కొద్దిరోజుల అనంతరం రచ్చబండ వద్ద,న్యాయమూర్తి ఎదుట గ్రామ ప్రజలందరుముందు పంచాయితీపెట్టిన షావుకారు ,ధనపాలుడు అతనికుమార్తెను పిలిపించారు. ' షావుకారు మంచివాడు కనక నీకు ఒకఅవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నావద్దనున్న చేతిసంచిలో రెండు గోళీలు ఉన్నాయి.వాటిలోఒకటి నల్లగోళి,మరొకటి తెల్లగోళి  ఉన్నాయి. మీఅమ్మాఇనే సంచిలోనిగోళి ఒకటి తీయమనండి నల్లగోళి ఆమెచేతికివస్తే షావుకారును వివాహం చేసు కోవాలి,అదే తెల్లగోళి ఆమె చేతికివస్తే షావుకారును వివాహం చేసుకోనవసరంలేదు,పైగా బాకీపడిన ఐదువేల వరహలుకూడా రద్దు చేయబడతాయి'  అన్నాడు న్యాయమూర్తి. ధర్మపాలునికుమార్తె న్యాయమూర్తి ప్రకటనలో ఏదోమోసంఉందని గ్రహించింది.
షావుకారు, న్యాయమూర్తికి బంధుత్వఉంది. ఆసంచిలో రెండు నల్లగోళీలే ఉన్నాయని ఊహించిన ఆమె,అఇష్టంగానే తలఊపింది. న్యాయాధికారే స్వయంగా ఆమెవద్దకువచ్చి కొద్దిగా సంచితెరచి ఒకగోళి తీయమన్నాడు. క్షణకాలంఆలోచించిన ఆమె సంచిలో గోళినితీస్తు ,బలంగా తుమ్ముతూ చేతిలోని గోళిని పక్కనే ఉన్న నేలబావిలో మెరువేగంతో వదిలింది.'పెద్దలు మన్నించాలి తుమ్ము ఆపుకోలేకపోయాను,పైగా వచ్చేముందు తలకు నూనెరాసుకున్నచేతుకావడంతో తుమ్మడంవలన గోళి చేజారి బావిలో పడింది. అదిపోతేపోయింది సంచిలో మరోగోళి ఉందిగా దాన్నిచూసి తమరు నిర్ణం తెలియజేయండి 'అన్నది. 
'అవును ఆఅమ్మయి చెప్పినదే నిజం బావిలో పడినది ఏరంగు గోళినో తెలియాలంటే సంచిలో ఏరంగు గోళి ఉందో చూస్తే సరిపోతుంది'అన్నారు అక్కడి ప్రజలు.తనచేతిసంచిలోని గోళిని వెలుపలకుతీసాడు న్యాయమూర్తి.అదినల్లగోళి ,ఆనందంతో ఆగ్రామస్తుంతా కరతాళధ్వనులు చేసారు.తప్పుడు ఆలోచనచేసి అతితెలివి చూపినందుకు తనకు తగినశాస్తి జరిగింది అనుకుంటూ ఇంటిదారిపట్టాడు షావుకారు' అన్నబామ్మ, 'బాలలు తెలుసుకున్నారుగా న్యాయానిదేవిజయం' అన్నది.బుద్ధిగా తలఊపారు పిల్లల అందరు.




కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం