గురు శిష్య సంబంధం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవులకు  ప్రాణవాయువును అందించి వారి జీవితాలకు ఆయువును పోస్తున్నది చెట్లు  అవి అడవులలో  పెరుగుతూ ఉంటాయి  మానవుడు ఆ చెత్తను నరికి తాను జీవించడం కోసం తన ఇల్లు కట్టుకోవడం  ఆ స్థలాన్ని పొలం గా మార్చి వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించి చివరకు అడవులు లేకుండా చేసే స్థితికి వస్తున్నాడు  దీనివల్ల ఏం జరుగుతుంది మానవునికి కావలసిన ఆక్సిజన్ (ప్రాణవాయువు) దొరకటమే అబ్బురంగా ఉంటుంది  ఆ స్థితి రాకుండా ఉండాలంటే మానవులలో చైతన్యం పెరిగి  తన ఇంటి ఎదురుగా తనకు కావలసిన చెట్లను  పెంచడం అలవాటు చేసుకుంటే ఆ కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాన్ని హాయిగా కొనసాగిస్తారు అనడంలో ఎలాంటి  అభ్యంతరము లేదు. ఒక చెట్టు కావాలి అంటే దానికి ముందు బీజం వేయాలి  దానికి నీరు పోసి  మొక్కగా మారిన తర్వాత దానిని రక్షించుకుంటూ చీడపీడలు పట్టకుండా చూసుకుంటూ వృక్షం అయ్యేలా దానిని సాకాలి  ఈ చెట్టు మొత్తానికి మూలం  కాండము  అది ఎంత బలంగా ఉంటే అన్ని కొమ్ములు ఎక్కువగా ఆ చెట్టుకు వస్తాయి  అవి ఎన్ని ఎక్కువ కొమ్మలు ఉంటే అన్ని ఎక్కువ ఫలాలు  మన చేతికి వస్తాయి అన్ని కొమ్మలలో నుంచి వస్తే కానీ మన జీవితాలు నిలువవు  ఆ పండ్లు మన ఆకలిని తీర్చవు వేళ్ళకు నీళ్లు అందక వేళ్ళు ఎండిపోతే కాండం తప్పకుండా ఎండుతుంది  అది ఎండిన మరుక్షణం మిగిలిన కొమ్మలన్నీ వెళ్ళడానికి ప్రారంభిస్తాయి  కనుక మూలాన్ని ఎప్పుడూ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి  అలా చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేవు అంటున్నాడు ప్రేమలో అలాగే విద్యార్థి దశ నుంచి తాను విద్యను అభ్యసించాలన్న కోరిక  మనసులో వేల్ళూరితే కానీ  కాండం బలపడడానికి  మంచి గురువు కావాలి  ఆ గురువును ఎన్నుకోవడంలోనే  శిష్యుని  ప్రజ్ఞ తెలిసిపోతుంది  గురువు ఉపదేశం చేయాలి  ఊరికే అక్షరాలు చెప్పినంత మాత్రాన వారికి  కానీ వీరికి కానీ ఎవ్వరికి ప్రయోజనం ఉండదు  సత్ ఏదైతే ఉన్నదో  శాశ్వతమైనటువంటి  ఎలాంటి మార్పులు లేనటువంటి  పదార్థాన్ని గురించి  గురువుగారు చక్కగా బోధించినట్లయితే  ఆ సద్బోధ వల్ల  విద్యార్థి మానసిక స్థితి పరిణతి చెంది  తాను చేరవలసిన స్థితికి చేరుకుంటాడు  అలా కాకుండా జరిగితే ఆ చెట్టుకు జరిగిన  స్థితి  ఇతనికీ జరుగుతుంది అని చెబుతున్నాడు వేమన మరి ఆ వేమన  రాసిన ఆటవెలదిని చదవండి మీకే తెలుస్తుంది.

"గురు శిష్యులనుగ కొమ్మలు  గురువును గానంగా వేరు గురువరుడెంతో పరముడంచి యుండు నిత్యము ధరలోపల మనుజులెల్ల తలపరు వేమ..."  


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం