చిట్టి చిలకమ్మా అమ్మకొట్టిందా!;-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ .9884429899.
 తూరుపు దిక్కున సూర్యుడు రాకముందే కొమ్మపైన పిల్లరామచిలుక ఏడుస్తూ కనిపించింది కోతికి. 
'చిట్టిచిలకమ్మ అమ్మకొట్టిందా ?'అన్నడు కోతి. 
"అవును నాఅల్లరి ఎక్కువగాఉందట అందుకు'' అందిపిల్ల రామచిలుక. ''ఇదిగో ఈ జామపండు తిను నీకుమంచి కథ చెపుతాను''అన్నకోతి..... "బురదనేలపై మెల్లగా నడుచుకుంటూ జారుతూ , తడబడుతూ వెళుతున్నాడు తాబేలు తాత.''తాతా ఎక్కడికి ఇంతఉదయాన్నే బయలుదేరావు ''అన్నాడు చెట్టుపైన ఈతపళ్ళు తింటున్నచిలుక . ''మనవడా రాత్రి ఉరుములతో వర్షంకురిసిందికదా,పుట్టగొడుగులు మోలిచి ఉంటాయి అవిచాలా బలవర్ధకమై ఆహారం అందుకే వెదుకుతూ వెళుతున్నా ''అన్నాడు తాబేలు తాత. ''సరే ఇవిగో రెండు ఈతపళ్ళు తింటూవెళ్ళు ''అని తాబేలు నోటికి అందించి వెళ్ళాడు చిలుక. కొంతదూరంలో ఎత్తుగాఉన్న గుట్టపైన పుట్టగొడులు కనిపించడంతో వాటికోసం గుట్టఎక్కుతూ పట్టతప్పి వెల్లికిలా పడ్డాడు తాబేలు. కొంతసేపటికి ఆహారం వెదుకుతూ వచ్చిన రెండుకుందేళ్ళు,తాబేలును చూస్తునే పరుగు పరుగునవచ్చి,తాబేలును యధాస్ధానానికిమార్చాయి. ''అమ్మయ్య మరికొద్దిసేపు అలానే ఉంటే మరణించేవాడిని మిత్రులారా ధన్యవాదాలు ,పుట్టగొడులకొరకు గుట్టఎక్కుతుంటే పట్టుతప్పి పడిపోయాను మీసహాయం మరచిపోనులే ఏదో ఒకరోజు మీరుణం తీర్చుకుంటా '' అన్నాడు తాబేలు.
''తాతా మేము రావడంకొద్దిగా అలస్యం అయిఉంటే నీప్రాణాలకు ప్రమాదం ఏర్పడి ఉండేది. ఐనా నిన్ను నువ్వు కాపాడుకోలేవు నువ్వు మాకు సహాయం చేస్తావా ? వెళ్ళిరా'' అనికుందేళ్ళు వెళ్ళిపోయాయి.
నాలుగు పుట్టగొడుగులు తిన్న తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ కుందేళ్ళ బొరియ దగ్గరకు వచ్చేసరికి ,కుందేళ్ళ పిల్లలు ఆడుకుంటూ కనిపించాయి. 
ఇంతలో చేరువలో నక్కలు ఊళవేయడం వినిపించడంతోకుందేళ్ళ పిల్లలను వాటి బొరియలోనికి పంపి బొరియ పైభాగాన పక్కనే ఉన్న ముళ్ళకంచెను పెట్టి, చేరువలోని ముళ్ళపొదలలో తాబేలు దాగింది. కొద్దిసేపటికి నక్కలగుంపు ఆపరిసరాలను వాసన చూస్తు తాబేలును ఏమిచేయలేక ,ఆహారం వెదుకుతూ దూరంగా వెళ్ళిపోయాయి.
రెండు చేతులనిండుగా ఎర్రదుంపలతో వచ్చిన కుందేళ్ళు తమ బొరియపై ఉన్న ముళ్ళకంపను పక్కకు లాగాయి. బొరియలోనుండి వచ్చిన కుందేళ్ళ పిల్లలు నక్కలకు తాము దొరకుండా తాబేలు తాత ఎలాకాపాడాడో వివరించాయి.
'' తాతా వయసులో పెద్దవాడివి అనేగౌరవంలేకుండా నిన్ను అవమానకరంగా మాట్లాడినా మాపిల్లల ప్రాణాలను రక్షించావు మమ్ములను క్షమించు''అన్నాయి కుందేళ్ళు. పిల్లలు నాశరీరంపైన ఉన్న బలమైన డిప్ప కవచంలా ఉంటుందికనుక నక్కలు నన్ను ఏమిచేయలేక వెళ్ళిపోయాయి. చిట్టి చీమలన్నికలసి ఎంతపెద్ద పుట్టపెడతాయోకదా! గడ్డిపోచలన్ని ఏకమై గజరాజును బధించలేదా! కాకులు చూడండి ఏదైనా ఆహారం తమకంటపడితే మిగిలిన కాకులనుపిలుస్తాయి. ఐక్యతకు ఇవన్ని ఉదాహరణలే! ఎటువంటి పరిస్ధితులలోనైనా మనం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ స్నేహంతో మెలిగితే మనదే విజయం. ఐకమత్యమే మనబలం. ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో చెప్పలేమీ. శత్రుత్వంతో ఏది సాధించలేము.తప్పుడు పనులకు ,చెప్పుడుమాటలకు దూరంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు విజేతలే ''అన్నాడు తాబేలు తాతా.
''భలే భలే బాగుందికథ, చూస్తుందేమో ఎదురు  అక్కడ వెళుతున్నా అమ్మ నేను కోతి 'అనితుర్రుమంది పిల్లరామచిలుక.దానిభాష అర్ధంకాని కోతి తెల్లమొఖంవేసాడు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం