బంధనాల్లో మగువ (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఎదఎదకొక కథ ఉన్నది. ప్రతి ఎదకొక వ్యథ ఉన్నది. అమ్మదో, చెల్లిదో, అనురాగవల్లిదో.
ఏదైతేనేం? ఏమైతేనేం? ప్రతికథలో సెంటర్ పాయింట్ "ఆమె" దే. ఏక్షణాన మనువుగారు
"న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి" అన్నారో, మగమహారాజులు దాన్ని అక్షరాలా పాటిస్తున్నారు. కాని..., అతడేచెప్పిన "యత్ర నార్యంతుపూజ్యతే…" ను మాత్రం తుంగలో తొక్కారు. ఎందుకంటే..?, వీరు మగధీరులు కదా! వారికి నచ్చిందే చేస్తారు. జీవితంలో "అర్ధ" నారి అనితెలిసినా దాన్ని కేవలం "పడక్కి" మాత్రం పరిమితంచేశారు. ఏం? మరి అన్నింటిలోనూ "అర్ధ" కాలేదా? "ముదితల్ నేర్వగరాని..." అన్నది ఎరుగరా? అయినా అదంతా వారి లలాటలిఖితం కదూ!? అన్నట్లు అది రాసినోడూ మగవాడేకదూ!? అందుకే మగువను బంధనాల్లో ఉంచారు కదూ?!!!
++++++++++++++++++++++++++++++++

కామెంట్‌లు