తెలుగు వెలుగు సాహిత్యవేదిక, ఎస్.వి .ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో పఠాన్ చెరువు దరి జరిగిన జాతీయ సాహిత్య సంబరాలలో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం కవితను సంకలనంలో తీసుకుని జాతీయ స్థాయి పురస్కారం'కవి శ్రేష్ఠ" బిరుదు తో బాటు ' తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి ధృవపత్రం, జ్ఞాపిక, దుశ్శాలువతో తానా అమెరికా అధ్యక్షుడు శ్రీ చిగురుమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిధి స్వహస్తాలతో నిర్వాహకులు శ్రీ మోటూరి నారాయణ రావు, పి.వి.ఎస్.ఎన్ మూర్తి ,టాగ్ లైన్ కింగ్ ఆలపాటి, రచయిత కవి కిలపర్తి దాలినాయిదు,నవనీత రవీందర్ ,సినీ గేయ రచయిత నంది పురస్కార గ్రహీత సాధనాల వేంకట స్వామినాయిడు సాహితీ సభలో ఘనంగా సత్కరించారు. సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులు ప్రసాద్ మాస్టరు కి శుభాకాంక్షలు అందచేసారు. బదులుగా ఆయన తను ఆరాధించే మహాకవి శ్రీ శ్రీ జయంతి నాడు జరిగిన ఈ సన్మానం పూర్వజన్మ సుకృతమని నిర్వాహకులకు
అభినందించిన మిత్రులందరికి ధన్యవాదాలు తెలియచేశారు.
...........................




addComments
కామెంట్ను పోస్ట్ చేయండి