*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0275)*

బ్రహ్మ, నారద సంవాదంలో.....
నందిచే శుక్రాచార్యుని అపహరణ - శివునిచే మింగబడిన శుక్రాచార్యుడు, శివలింగము నుండి బయటకు వచ్చుట - శుక్ర నామము - మృత్యుంజయ జపము - శివాష్టోత్తర శతనామ వర్ణన - శివుడు అంధకునకు వరములు ఇచ్చుట......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! రుద్రని ఉదరంలో ఉండి శుక్రాచార్యుడు, మహాదేవుని మహా మంత్రాన్ని జపించి, పునరుజ్జీవితుడు అయి  శుక్రుడుగా యుద్ధ భూమికి వెళ్ళాడు. అక్కడ, శంకరుని త్రిశూలము చేత కట్టబడిన అంధకుడు కొన ఊపిరితో ఉండి, మహాదేవుని 108 నామాలతో స్తుతిస్తున్నాడు. రుద్రుని ఒక్కొక్క నామం పలుకుతున్నప్పుడు, ఆ ఉమాపతిని తన మనస్సులో నిలుపుకుంటున్నాడు. పరమశివుని నామాలు పలుకడం వలన తన శరీరంలో వస్తున్న ప్రకంపనలకు, పరవశించి పోతున్నాడు, అంధకుడు.*
*మహాదేవం విరూపాక్షం చంద్రార్ధకృత శేఖరమ్ |*
*అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినమ్ ||*
*వృషభాక్షం మహాజ్ఞేయం పురుషం సర్వకామదమం |*
*కామారిం కామదహనం కామరూపం కపర్ధినమ్ ||*
*విరూపం గిరీశం భీమం స్రుక్కిణం రక్తవాససమ్ |*
*యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినమ్ ||*
*గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరమ్ |*
*అణిమాది గుణాధారం త్రిలోకైశ్వర్యదాయకమ్ ||*
*వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలంపటమ్ |*
*మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరమ్ ||*
*త్రైలోక్య ద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూదనమ్ |*
*కృత్తికానాం సుతైర్యుక్తమున్మత్తం కృత్తివాససమ్ ||*
*గజకృత్తి పరీధానం క్షుబ్ధం భుజగభూషణమ్ |*
*దత్తాలంబం చ వేతాలం ఘోరం శాకిని పూజితామ్ ||*
*అఘోరం ఘోర దైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిమ్ |*
*భస్మాంగం జటిలం శుద్ధం భేరుండ శతసేవితమ్ ||*
*భూతేశ్వరం భూతనాధం పంచభూతాశ్రితమ్ ఖగమ్ |*
*క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియమ్ ||*
*చండతుండం గరుత్మంతం నిస్త్రింశం శవభోజనమ్ |*
*లేలిహానం మహారౌద్రం మృత్యుంమృత్యోరగోచనమ్ ||*
*మృత్యోర్ముత్యుం మహాసేనం శ్మశానారణ్యవాసినమ్ |*
*సత్యం త్వసత్యం సద్రూపమసద్రూపమహేతుకమ్ ||*
*అర్ధనారీశ్వరం భానుం భానుకోటిశతప్రభుమ్ |*
*యజ్ఞం యజ్ఞపతిం రుద్రమీశానం వరదం శివమ్ ||*
*అష్టోత్తరశతం హ్యేతన్మూర్తీనాం పరమాత్మనః |*
*శివస్య దానవో ధ్యాయన్ ముక్తస్తస్మాత్మహాభయాత్ ||*
                           (శి.పు.రు.సం.యుద్ధకాండ 49/5 - 18)
*"ఎంతో భీకరమైన, గొప్పదైన భయం నుండి నన్ను రక్ష చేయి అంబాపతీ" అని అష్టోత్తర శతనామ పూజ చేసాడు అంధకుడు. "మహేశా! పార్వతీ పతీ! నీ కుమారుడనైన నా బుద్దిలేమి గురించి ఆలోచించండి. నేను నా తల్లి అయిన పార్వతిని ఎల్లపేళలా గౌరవ భావంతో చూసేలా అనుగ్రహించు. నీవు, చల్లని చంద్రకిరణములు, శంఖము, వంటి శరీర రంగు కలవాడివి. నా మీద క్రోధము వదిలి పెట్టి నాకు, నిరంతరము మీ ఇద్దరి మీదా భక్తి ఉండేటట్టు ఆశీర్వదించు. నాకు దేవతలతో ఉన్న వైరము పోవలెను. నేను ప్రశాంతమైన మనసుతో ఉండాలి. మీ కృపతో పుట్టిన వాడిని. నాలో విరుద్ధమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. నీ యందు భక్తి, దైత్య లక్షణాలు. ఈ వైరుధ్యాన్ని తొలగించి, నీ భక్తునిగా చేయి స్వామి." అని వేనోళ్ళ ప్రార్ధించాడు.*
*ఈ ప్రార్థన విన్న రుద్రుడు, అంధకుని మీద కరుణ కురిపించి, అక్కున చేర్చుకుని, ఉమాపార్వతులు నుదుటి మీద ముద్దు పెట్టారు. వెంటనే అంధకునికి, తన పూర్వ జన్మ స్ఫురణ వచ్చింది. తల్లిదండ్రులకు ప్రణామాలు చేసి, తన కోరికలు అన్నీ తీరి పోయి, అమ్మ కరుణతో గణాద్యక్ష పదవి కూడా పొందాడు, అంధకుడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం