దాదాభాయి నౌరోజీ (1825-1917);- తాటి కోల పద్మావతి

 భారతీయ రాజకీయ గురువుగా ఆర్థికవేత్తగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుల్లో ఒకడిగా చరిత్రపుటల్లో నిలిచిపోయిన మహనీయుడు. 19వ శతాబ్దంలో జన్మించిన గొప్ప వ్యక్తుల్లో ఒకడుగా బ్రిటిష్ వారి చేత భారతీయుల చేత మన్ననలు పొందిన ప్రజ్ఞాశీలి. ఈయన 18 25 లో ఒక పారసీ కుటుంబంలో జన్మించాడు. డిగ్రీ చదువుకొని లండన్ వెళ్ళాడు
. అక్కడ ఒక వ్యాపార వేత్తకు సహాయకుడిగా పని చేశాడు. అక్కడ నివసిస్తూ అక్కడున్న భారతీయులను ఏకం చేసి'ఇండియన్ సొసైటీ'ని స్థాపించాడు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన ఒకరిద్దరిలో ఈయన ఒకడు.
'గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా'గా పిలవబడే ఈయన భారతదేశం తిరిగి వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుల్లో ఒకడు అయ్యాడు. ఆయన స్వరాజ్యం కోసం పాటుపడడమే కాక ఎందరో ఎందరో విద్యావంతుల్ని ఆ సంస్థలో కలపడానికి తోడ్పడ్డాడు.
ఈయన కాంగ్రెస్ లో చేరినప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగుల సమస్త గానే ఉండేది. అంతేకాక వారి సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చించడమే దాని ప్రధాన ఉద్దేశం. ఆయన 18 96 లో ఆ తర్వాత 1906లో దానికి అధ్యక్షత వహించి ఉద్యోగుల సమస్యలే కాకుండా స్వతంత్ర భారతదేశ వాంఛను వెల్లడించాడు. అతడి కార్యక్రమాలు తెలుసుకొని న్యాయస్థానానికి పిలిచి అక్కడ అతడిని కూర్చోమని ఆదేశించారు.
అయితే ఆయన స్వతంత్రం కోరినా వారితో ఎప్పుడూ సంబంధాలు కొనసాగించిన మేధావి.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం