ప్రతిభామూర్తులు. బాల గంగాధర తిలక్. (1856-1920)- తాటి కోల పద్మావతి

 "స్వాతంత్రమే నా జన్మ హక్కు"అన్న మొదటి స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్. 18 56 లో మహారాష్ట్రలో జన్మించిన తిలక్ అసలు పేరు బస్వంత్ గంగాధర తిలక్. చిన్నతనం నుండి దేశభక్తి భావంతో విదేశీ పాలనను ద్వేషించేవాడు. 1879లో ఎల్ ఎల్ బి చదివి 18 81 లో మరాఠీలో కేసరి అనే పత్రికను నడిపాడు. అంతేకాక మరాఠా అనే ఇంగ్లీషు పత్రికను కూడా నడిపాడు. ఈయన ఆర్యన్, ఆర్కిటిక్ హోమ్ఇ ది వేదాస్ గ్రంథాల ద్వారా పాశ్చర్ దేశాలలో కూడా గుర్తింపు పొందారు. పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆయన ఎంతో సేవ చేశారు. ఆయనను భారతీయ రాజకీయ అనిశ్చితకు తండ్రిగా పిలవబడ్డాడు. దానికి కారణం బ్రిటిష్ వారి పాలనేనని గట్టిగా వాదించాడు. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు కారణం చెప్పమని అధికారులు కోరినప్పుడు తనను తాను సమర్ధించుకుంటే నాలుగు రోజులు సుదీర్ఘ ఉపన్యాసమిచ్చిన దేశభక్తుడు. 19 16 లో అనిబిసెంట్తో కలిసి స్వదేశీ పాలన కొరకు పోరాడి సరైన జవాబు లభించిన తర్వాత ఉద్యమాన్ని విరమించాడు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన 1908 లో ఆరు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. ఆ జైలులోనే ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశాడు. అతడు భారతీయ చరిత్ర, సంస్కృతులను గొప్పగా అర్థం చేసుకున్నాడు. 1905లో బెంగాల్ విభజనను వ్యతిరేకించాడు. ఆయన జీవితాంతం స్వాతంత్ర సాధనకు పోరాడి 1920లో పరమపదించిన గొప్ప దేశభక్తుడు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం