తెలుగు పత్రికా రంగానికి నూతన వరవడి సృష్టించిన ప్రజ్ఞాశీలి నార్ల వెంకటేశ్వరరావు. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంస్థాపక సంపాదకుడు నార్ల. ఈయన 1908లో జబల్పూర్ లో జన్మించారు. మచిలీపట్నం నోబుల్ కాలేజీ విద్యార్థిగా ఉండగానే వచన వ్యాసంగాన్ని చేపట్టారు. ఆ రోజుల్లోనే'కృష్ణా పత్రిక'పార్ట్ టైం ఎడిటర్ గా పనిచేశారు.డా"పట్టాభి గారి'జన్మభూమి'పత్రికకు, లాహోర్ నుండి వెలువడే'పీపుల్స్'కు ప్రిలాన్సుగా వ్యాసాలు రాసి వాటితో వచ్చే పైసలు ఫీజులకు తన ఖర్చులకు వాడుకునేవారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా'ఉప్పు సత్యాగ్రహం'గురించి జన్మభూమికి వ్యాసం రాసినందుకు బ్రిటిష్ వారి లాటి దెబ్బలు తిన్నాడు. ఆ రోజే జర్నలిజం వృత్తిగా చేపట్టాలని మద్రాసు బయలుదేరాడు. మొదట'జస్టిస్'అనే పత్రికలో అప్రెంటీస్ గా చేరాడు. ఆ పత్రిక ఏమి ఇవ్వకపోయినా పోలీస్ రిపోర్టు ఆధారంగా ఉగ్రవాదిగా కోరుకుంటూ ఉద్యోగం నుండి తొలగించారు. ఆ తర్వాత 1938లో ఆంధ్రప్రభ లో న్యూస్ ఎడిటర్ గా చేరి త్వరలోనే సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్లు కూడా శ్రీ నార్ల సంపాదకీయాలు పనిచేశాయి. నాగార్జునసాగర్ కు ఆ పేరు సూచించింది కూడా ఆయనే. తన కలం బలంతో సమస్యలకు ఉద్యమ రూపం ఇచ్చిన పత్రిక సంపాదకుడు. ఈయన హేతువాది, మానవతావాది కూడా. ఆయన కలం బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి లను కూడా వదలలేదు. ఆయన నిర్భీతికి వారు ఆశ్చర్యపడేవారు. ఆ తర్వాత 1960లో విజయవాడలో ఆంధ్రజ్యోతి స్థాపించినప్పుడు దాని సంపాదకులుగా ఉండి 1970 వరకు పని చేశారు. మాట-మంతి, వేమన గురజాడ, వీరేశలింగంపై ఎన్నో సాధికారిక రచనలు చేయడమే కాక'నవయుగాల బాట నార్ల మాట'అనే మకుటంతో రాసిన పద్యాలు వేమనను మరిపిస్తాయి. ఆధునిక తెలుగు జర్నలిజానికి ఆధ్యుడుగా పేర్కొనదగ్గ నార్ల 1985లో పరమపదించారు.
నార్ల వెంకటేశ్వరరావు. (1908-1985);- తాటి కోల పద్మావతి
తెలుగు పత్రికా రంగానికి నూతన వరవడి సృష్టించిన ప్రజ్ఞాశీలి నార్ల వెంకటేశ్వరరావు. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంస్థాపక సంపాదకుడు నార్ల. ఈయన 1908లో జబల్పూర్ లో జన్మించారు. మచిలీపట్నం నోబుల్ కాలేజీ విద్యార్థిగా ఉండగానే వచన వ్యాసంగాన్ని చేపట్టారు. ఆ రోజుల్లోనే'కృష్ణా పత్రిక'పార్ట్ టైం ఎడిటర్ గా పనిచేశారు.డా"పట్టాభి గారి'జన్మభూమి'పత్రికకు, లాహోర్ నుండి వెలువడే'పీపుల్స్'కు ప్రిలాన్సుగా వ్యాసాలు రాసి వాటితో వచ్చే పైసలు ఫీజులకు తన ఖర్చులకు వాడుకునేవారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా'ఉప్పు సత్యాగ్రహం'గురించి జన్మభూమికి వ్యాసం రాసినందుకు బ్రిటిష్ వారి లాటి దెబ్బలు తిన్నాడు. ఆ రోజే జర్నలిజం వృత్తిగా చేపట్టాలని మద్రాసు బయలుదేరాడు. మొదట'జస్టిస్'అనే పత్రికలో అప్రెంటీస్ గా చేరాడు. ఆ పత్రిక ఏమి ఇవ్వకపోయినా పోలీస్ రిపోర్టు ఆధారంగా ఉగ్రవాదిగా కోరుకుంటూ ఉద్యోగం నుండి తొలగించారు. ఆ తర్వాత 1938లో ఆంధ్రప్రభ లో న్యూస్ ఎడిటర్ గా చేరి త్వరలోనే సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్లు కూడా శ్రీ నార్ల సంపాదకీయాలు పనిచేశాయి. నాగార్జునసాగర్ కు ఆ పేరు సూచించింది కూడా ఆయనే. తన కలం బలంతో సమస్యలకు ఉద్యమ రూపం ఇచ్చిన పత్రిక సంపాదకుడు. ఈయన హేతువాది, మానవతావాది కూడా. ఆయన కలం బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి లను కూడా వదలలేదు. ఆయన నిర్భీతికి వారు ఆశ్చర్యపడేవారు. ఆ తర్వాత 1960లో విజయవాడలో ఆంధ్రజ్యోతి స్థాపించినప్పుడు దాని సంపాదకులుగా ఉండి 1970 వరకు పని చేశారు. మాట-మంతి, వేమన గురజాడ, వీరేశలింగంపై ఎన్నో సాధికారిక రచనలు చేయడమే కాక'నవయుగాల బాట నార్ల మాట'అనే మకుటంతో రాసిన పద్యాలు వేమనను మరిపిస్తాయి. ఆధునిక తెలుగు జర్నలిజానికి ఆధ్యుడుగా పేర్కొనదగ్గ నార్ల 1985లో పరమపదించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి