అంతా విన్న తర్వాత మీరు మా దివాణంలోనే ఉండండి మీ శేష జీవితాన్ని ఇక్కడే ప్రశాంతంగా గడిపి వేయండి మీకు ఎలాంటి కొరత ఉండదు నా చిన్నప్పటి సహ పాటి నా కళ్ల ముందే ఉన్నాడు అన్న తృప్తి నాకు ఉంటుంది వెంగళ రెడ్డి చెప్పిన దానికి శేషాచార్యులు చాలాసేపు సమాధానం ఇవ్వలేదు సంశయిస్తున్నాడని గ్రహించిన వేంగళరెడ్డి చిన్నగా అతని భుజం తడుతూ మనం స్నేహితులం అందులో చిన్ననాటి స్నేహితులం మన మధ్య సందేహాలు ఉండరాదు. మీ మనసులో ఉన్నది ఏమిటో చెప్పండి అంటూ అడిగాడు చెప్పక తప్పదనిపించి చెప్పాడు. శేషాచార్యులు నా పిల్లలు నన్ను ఎంతగా కాదనుకున్నా వారిపై మమకారం చావటం లేదు నా మరణం వారి చేతి మీద జరగాలని నా వాంఛ అతని ఉద్దేశం ఏమిటో వేంగళరెడ్డికి బోధపడింది వెంటనే లేచి తన సేవకునికి చెప్పాడు. దివాణా గుమస్తా దగ్గరకు వెళ్లి ఓ 100 రూపాయలు అలాగే పట్టు వస్త్రాలు తీసుకురా అనగానే మ్రాన్ పడిపోయాడు శేషాచార్యులు అరగంట తర్వాత వచ్చిన నూతన వస్త్రాలు వంద రూపాయలు రొక్కం చేతిలో పెడుతూ శేషాచార్యులకు చెప్పాడు రక్త పాశం తెంచుకోవడం అందరికీ అంత సులువు కాదు మీరు ఈ రొక్కం ఉంచుకోండి మీ పిల్లలు దగ్గరే ఉంటూ శేష జీవితాన్ని గడపండి అనగానే రెడ్డి గారు నా స్వార్థం మిమ్ములను అతని మాటలను అడ్డుకుంటూ ఇందులో మీ స్వార్థమేమీ లేదు మనుషుల కంటే ధనం గొప్పది అని కాదు శేషాచార్యులు లేచి వెంగళ రెడ్డి పాదాలను తాకపోయాడు ఆ ప్రయత్నాన్ని వారిస్తూ చెప్పాడు రెడ్డి కాళ్లకు దండం పెట్టవలసిన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఒకరు తల్లిదండ్రులు మరొకరు విద్య నేర్పిన గురువు వీరికి తప్ప మరెవరికి దండం పెట్టవలసిన అవసరం లేదు వెళ్ళి రండి అంటూ అతని ప్రయాణానికి కావలసిన వెచ్చాల్ని కూడా అందజేసి దివాణం బయటి వరకు వెళ్లి సాగనంపాడు బుడ్డా వేంగళ రెడ్డి. ఆరోజు రాత్రి తలారి నరసింహతో సమాలోచన జరిపిన బుడ్డా వెంగళరెడ్డి తన మనసులోని సందిగ్ధన్ని చెప్పాడు అది విన్న నరసింహ ఇందులో సంశయించడానికి ఏముంది దొర మీకోసం కాకపోయినా మన గ్రామం కోసం అయినా వెళ్లి తీరాలి మా రెడ్డి మద్రాసు వెళ్లి సన్మానం చేయించి వచ్చాడు అని మన గ్రామస్తులు అందరూ చెప్పుకోవడానికి అయినా మీరు వెళ్లి తీరాలి ఇది మీ ఒక్కరికి చేస్తున్న సన్మానం కాదు మన గ్రామ ప్రజలందరికీ చేస్తున్న సన్మానం ఆలోచించండి దొరా అన్నీ తెలిసినవారు ఇంతకంటే ఏమీ చెప్పలేను అన్నాడు రాత్రి పొద్దు పోయే వరకు ఆలోచిస్తూ కూర్చున్న వేంగళ రెడ్డి కి చివరికి దళారి నర్సింహం చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని అనిపించింది.
దానశీలి- బుడ్డా వేంగళ రెడ్డి (35); - ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
అంతా విన్న తర్వాత మీరు మా దివాణంలోనే ఉండండి మీ శేష జీవితాన్ని ఇక్కడే ప్రశాంతంగా గడిపి వేయండి మీకు ఎలాంటి కొరత ఉండదు నా చిన్నప్పటి సహ పాటి నా కళ్ల ముందే ఉన్నాడు అన్న తృప్తి నాకు ఉంటుంది వెంగళ రెడ్డి చెప్పిన దానికి శేషాచార్యులు చాలాసేపు సమాధానం ఇవ్వలేదు సంశయిస్తున్నాడని గ్రహించిన వేంగళరెడ్డి చిన్నగా అతని భుజం తడుతూ మనం స్నేహితులం అందులో చిన్ననాటి స్నేహితులం మన మధ్య సందేహాలు ఉండరాదు. మీ మనసులో ఉన్నది ఏమిటో చెప్పండి అంటూ అడిగాడు చెప్పక తప్పదనిపించి చెప్పాడు. శేషాచార్యులు నా పిల్లలు నన్ను ఎంతగా కాదనుకున్నా వారిపై మమకారం చావటం లేదు నా మరణం వారి చేతి మీద జరగాలని నా వాంఛ అతని ఉద్దేశం ఏమిటో వేంగళరెడ్డికి బోధపడింది వెంటనే లేచి తన సేవకునికి చెప్పాడు. దివాణా గుమస్తా దగ్గరకు వెళ్లి ఓ 100 రూపాయలు అలాగే పట్టు వస్త్రాలు తీసుకురా అనగానే మ్రాన్ పడిపోయాడు శేషాచార్యులు అరగంట తర్వాత వచ్చిన నూతన వస్త్రాలు వంద రూపాయలు రొక్కం చేతిలో పెడుతూ శేషాచార్యులకు చెప్పాడు రక్త పాశం తెంచుకోవడం అందరికీ అంత సులువు కాదు మీరు ఈ రొక్కం ఉంచుకోండి మీ పిల్లలు దగ్గరే ఉంటూ శేష జీవితాన్ని గడపండి అనగానే రెడ్డి గారు నా స్వార్థం మిమ్ములను అతని మాటలను అడ్డుకుంటూ ఇందులో మీ స్వార్థమేమీ లేదు మనుషుల కంటే ధనం గొప్పది అని కాదు శేషాచార్యులు లేచి వెంగళ రెడ్డి పాదాలను తాకపోయాడు ఆ ప్రయత్నాన్ని వారిస్తూ చెప్పాడు రెడ్డి కాళ్లకు దండం పెట్టవలసిన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఒకరు తల్లిదండ్రులు మరొకరు విద్య నేర్పిన గురువు వీరికి తప్ప మరెవరికి దండం పెట్టవలసిన అవసరం లేదు వెళ్ళి రండి అంటూ అతని ప్రయాణానికి కావలసిన వెచ్చాల్ని కూడా అందజేసి దివాణం బయటి వరకు వెళ్లి సాగనంపాడు బుడ్డా వేంగళ రెడ్డి. ఆరోజు రాత్రి తలారి నరసింహతో సమాలోచన జరిపిన బుడ్డా వెంగళరెడ్డి తన మనసులోని సందిగ్ధన్ని చెప్పాడు అది విన్న నరసింహ ఇందులో సంశయించడానికి ఏముంది దొర మీకోసం కాకపోయినా మన గ్రామం కోసం అయినా వెళ్లి తీరాలి మా రెడ్డి మద్రాసు వెళ్లి సన్మానం చేయించి వచ్చాడు అని మన గ్రామస్తులు అందరూ చెప్పుకోవడానికి అయినా మీరు వెళ్లి తీరాలి ఇది మీ ఒక్కరికి చేస్తున్న సన్మానం కాదు మన గ్రామ ప్రజలందరికీ చేస్తున్న సన్మానం ఆలోచించండి దొరా అన్నీ తెలిసినవారు ఇంతకంటే ఏమీ చెప్పలేను అన్నాడు రాత్రి పొద్దు పోయే వరకు ఆలోచిస్తూ కూర్చున్న వేంగళ రెడ్డి కి చివరికి దళారి నర్సింహం చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని అనిపించింది.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి