దాన శీలి- బుడ్డా వేంగళ రెడ్డి (38); - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ  నేను గొప్పగా ఏమీ చదువుకోలేదు నాది కేవలం గ్రామస్థాయి చదువు మాత్రమే  అయితే నాకు జిజ్ఞాస వల్ల పుస్తక పఠనం వల్ల మరి కొంత జ్ఞానాన్ని సంపాదించగలిగాను ఇక ఈ సత్కారం గురించి పేరు ప్రఖ్యాతుల ఆశించి నేనిదంతా చేయడం లేదు  మానవునిగా సాటి మనిషికి నా వంతు సేవ చేయాలనే తపనతో చేశాను. నా అంతిమ ఘడియ వరకు కూడా చేస్తూనే ఉంటాను  నాకెలాంటి సత్కారాలపై పెద్దగా ఆశ లేదు విక్టోరియా మహారాణి లాంటి వారు పంపిన తిరస్కరించడం భావ్యం కాదని ఈ సత్కారం రాబోయే తరానికి ఒక చారిత్రక చిహ్నంగా  నిలుస్తుందని భావించి వచ్చాను ఏదేమైనా నన్ను సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు జరిపించి
నన్ను ఈ విధంగా సత్కరించి నాలోని ఉద్దేశాన్ని పలువురు ముందు చెప్పడానికి అవకాశం కల్పించిన గవర్నర్ జనరల్ గారికి వారి సిబ్బందికి  ఇతర అధికారులకు ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని ముగించారు వేంగళ రెడ్డి తెలుగు ప్రసంగాన్ని దుభాషి ఇంగ్లీషులో అనుమతించి వివరించాడు  ప్రేక్షకులలో పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు ఓ మామూలు వ్యక్తిగా కనిపించే ఇతనిలో ఎంత లోతైన ఆలోచనలు ఉన్నాయి అని సభాకులందరూ నివ్వెర పోయారు  సభా వేదిక పైన గవర్నర్ జనరల్ కూడా ముగ్ధుడై పోయాడు ఆనందంతో వెంగళరెడ్డిని కౌగిలించుకున్నాడు అతని కళ్ళు  చమర్చాయి.
గవర్నర్ జనరల్ విజ్ఞప్తి మేరకు రెండు రోజులపాటు అక్కడే ఉండి చెన్నపురంలో ఉండే పురాతన కట్టడాలను బ్రిటిష్ వారి కట్టడాలను మరియు ముఖ్యంగా అక్కడి చర్చిని దర్శించారు  చర్చిని దర్శించడమే కాక లోపలికి వెళ్లి ప్రార్థన కూడా సలిపేసరికి అతని వెంట ఉన్న బ్రిటిష్ అధికారులు నివ్వెర పోయారు. ప్రార్థన జరిపి బయటకు వచ్చాక అధికారులు మీరు మా మతాన్ని నమ్ముతారా అనగా  మతాన్ని నమ్మను మనిషిని నమ్ముతాను నా దృష్టిలో ఏసుక్రీస్తు మానవత్వం విలువలను ప్రబోధించిన గొప్ప ప్రవక్త  ఆ మానవత్వపు విలువల కొరకే శిలువపై రక్తాన్ని కూడా చిందించి అమరుడయ్యాడు  ఆయన త్యాగశీలతకు జోహార్లు అర్పిస్తున్నాను. ఇతనే కాదు మానవాళి కోసం శ్రమించిన వ్యక్తి ఎవరైనా వారికి శిరస్సు వంచి నమస్కరిస్తాను  అన్న వేంగళ రెడ్డి మాటలు వారి హృదయాల్లో సూటిగా దూసుకుపోయాయి.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం