కుంభకర్ణ నిద్ర (జాతీయం వెనుక కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
   నిద్ర అనేది ఒక వరం. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన మనిషి తిరిగి నూతన ఉత్తేజం పొందడానికి నిద్ర ఎంతో అవసరం. చిన్న పిల్లలు ఎక్కువగా నిద్ర పోతుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రపోయే సమయం తగ్గుతూ, పని చేసే సమయం పెరుగుతూ వుంటుంది. ఆరోగ్యవంతమైన జీవితానికి ఆరుగంటలు నిద్ర తప్పనిసరి. కానీ కొందరు బద్దకస్తులు వుంటారు. వీరు అవసరాన్ని మించి నిద్రపోతూ వుంటారు. అతినిద్ర అనేక సమస్యలకు, అనారోగ్యానికి దారితీస్తుంది.
మనచుట్టూ ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా, ఎంత పెద్ద శబ్దాలు వచ్చినా లేవకుండా, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడూ నిద్రపోయే దానిని 'కుంభకర్ణ నిద్ర' అని అంటారు.
అసలు ఈ జాతీయం ఎలా వచ్చిందంటే కుంభకర్ణుడు రావణుని సోదరుడు. మహాబలవంతుడు. చాలా పెద్ద శరీరం కలవాడు. చిన్నప్పటినుంచీ పెద్ద పెద్ద జంతువులను అవలీలగా పట్టుకొని గుటుక్కున మింగేసేవాడు. వాన్ని చూసి అందరూ భయంతో వణికిపోయేవారు.
రావణ, కుంభకర్ణులు ఇద్దరూ బ్రహ్మ గురించి తపస్సు చేయడం మొదలు పెట్టారు. కుంభకర్ణుడు చాలా రోజులు అరివీర భయంకరంగా తపస్సు చేయసాగాడు. అది చూసి ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి పోయాడు. "స్వామీ... మీరు గనుక కుంభకర్ణునికి ప్రత్యక్షమయి అతను కోరిన వరాలు ఇస్తే... అసలే భయంకరమైన బలం కలిగిన కుంభకర్ణుడు ఎవరిని ఏం చేస్తాడో తెలీదు. కాబట్టి నువ్వు ఎలాగయినా సరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడాలి" అని ప్రార్థించాడు.
దాంతో బ్రహ్మ సరస్వతిని పిలిచి వరం కోరే సమయంలో నువ్వు 'అతని నాలుకపై వుండి అతను ఆరు నెలలు నిద్ర, ఒకరోజు భోజనం కోరుకునేటట్లు చేయి” అన్నాడు.ఆమె సరేనని అలాగే చేసింది. అందుకే కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడు. ఒక రోజు మాత్రమే లేస్తుంటాడు.
అందుకే  ఎవరైనా సరే ఎప్పుడూ నిద్రపోతుంటే వానిది "కుంభకర్ణ నిద్ర" అనడం ఈ కథ ఆధారంగానే వచ్చింది.
**********

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం