శరీర లక్షణం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మనిషి మనిషిగా జీవించాలి అంటే తన మనీష బాగా పని చేయాలి. మనీష అంటే బుజ్జి  ఆ బుద్ధి లేనివాడు దేనికి పనికిరాకుండా పోతాడు అసలు తన శరీర నిర్మాణం తెలుసుకోవాలి  ఏ అవయవం ఎందుకు పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అన్న విషయం తెలియకపోతే  దానిని నియంత్రించే పద్ధతి ఎందుకు తెలుస్తుంది కనుక ముందు ఏ నరం పనిచేస్తే శరీరానికి ఏ మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది  అన్న విషయాన్ని అవగాహన చేసుకుని ముందుకు వెళితే  ఈ శరీరం ద్వారా తాను సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏది ఉండదు  ప్రతిదీ  తన కరతలామలకం  అవుతుంది  దానికోసం ప్రయత్నించాలి ప్రతి వ్యక్తి  ఏమి తెలియకుండా చేసిన పని  ఫలితాన్ని ఇవ్వదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ముందు  తత్వం తెలియాలి  తత్వము అంటే  ఏదైతే ఉన్నదో అది నేను  అన్న విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే  ఏ అవయవం దేనికి పనికొస్తుంది  అన్నది తెలిస్తే ఆ అవయవంతో ఆ పనిని చేయించవచ్చు  అలా తెలిసి చేయడం చాలా తేదికగా అనిపిస్తుంది  మూల సిద్ధాంతం తెలియకుండా  విషయ పరిజ్ఞానం కావాలి అనుకునే వాడికి  అసలు ఏ విషయమైతే ఉన్నదో దానిని గురించి  ఓనమాలు కూడా తెలియవు  కనుక తన జ్ఞానంతో  ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడో దానికి ప్రాధాన్యతను ఇచ్చి దానిపైనే మనసును కేంద్రీకరించి అది తెలుసుకోవడానికి ఉపక్రమించాలి  అప్పుడు తప్పకుండా తన కార్యాన్ని సిద్ధించుకునే అవకాశం ఉంటుంది  లేకపోతే కష్టం అంతా వృధా అయిపోతుంది.
శరీరానికి కన్ను ఉన్నది కదా అని ప్రతి విషయాన్ని  చూడకూడదు  కావలసిన విషయం కోసం మాత్రమే  దానిని వినియోగించుకోవాలి  అలాగే నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడకూడదు  దాని పరిధి దాటకుండా  ఉండాలి. అలాగే ప్రతి అవయవానికి  నియమ నిబంధనలను పెట్టుకొని ఆ అవయవం ద్వారా చేయవలసిన చేయగలిగిన పనులు మాత్రమే చేస్తూ ఉండాలి  లేకపోతే అనేక అనర్థాలను కొని తెచ్చుకున్న వారవుతారు. అలా కాకుండా  వేరే విధంగా ప్రవర్తిస్తే మాత్రం  ఎంతోమందికి వ్యతిరేకులు కావాలి  అలాకాకుండా చేయవలసిన పద్ధతిలో చేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అలా ఉన్నవారు మాత్రమే సమాజంలో  మంచి పేరు సంపాదించుకుంటున్నారు  అంటున్నాడు  వేమన  తాను రాసిన ఆ పద్యాన్ని చదవండి.

"తనదు  దేహమందు తనకున్న  పరివారమందరి  బిలిపించి  హర్ష మొనగనల్ల  చావు గెలిచి  ఇందందు మెరిగియు  నడువ నేర్చు నాతడదురు వేమ..."


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం