ప్రకృతి విలయ తాండవం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఆకాశవాణి కేంద్రాలు సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని  వారికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంటారు  ప్రత్యేకించి వ్యవసాయదారులకు  సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు  అవసరమైన వాతావరణ పరిస్థితులను ఏరోజుకారోజు  రెండు మూడు పర్యాయములు  తెలియజేయడం కోసం  వాతావరణ పరిశోధన కేంద్రం వారు  ప్రతి పూట సమాచారాన్ని ఆకాశవాణి కేంద్రానికి పంపిస్తూ ఉంటారు వాటిని  వారు ఆంగ్లంలో ఇ చ్చిన విషయాన్ని తెలుగులో తర్జుమా చేసి  ప్రసారం చేస్తారు  చాలా పర్యాయాలు రేడియోలో చెప్పినా వర్షం రాకపోవడం కానీ  చెప్పకపోయినా రావడం కానీ  అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది  ఆకాశవాణిని నమ్మడం జరగదు.
కొంతమంది ధైర్యం చేసి  ఆకాశవాణి వారు అబద్ధాలు తప్ప నిజాలు చెప్పరా  ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు అని అడుగుతూ ఉత్తరాలు వ్రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి  అయితే ఆకాశవాణి వారు చెప్పే సమాధానం  వాన రాకడ ప్రాణం పోకడ  అన్న నానుడిని ఆధారం చేసుకుని  ఆ విషయాలు చెబుతాము ఆకాశవాణిని ఎప్పుడు నమ్మని జాలర్లు  దివిసీమ ఉప్పెన  సందర్భంగా సముద్రంలోకి వెళ్లిన అనేకమంది జాలర్లు చనిపోవడం  అమాయకపు ప్రజలు  ప్రకృతిని ఆస్వాదించడానికి సముద్రతీరానికి వెళ్లిన వారు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు  అప్పటినుంచి  రేడియోలో చెప్పిన కార్యక్రమాన్ని నమ్మటం మొదలు పెట్టారు. దివిసీమ తుఫాను సందర్భంగా రాత్రింబగళ్లు  పనిచేసినాయి రేడియో కేంద్రాలు. ప్రతి గంటకు  ఒక పర్యాయం వాతావరణ సూచన చెప్పి  ఏ క్షణాన పరిస్థితి ఎలా ఉంటుందో చాలా జాగ్రత్త వహించమని  సలహా చెపుతూ ప్రసారం చేశారు రేడియో వారు  మేఘాలను చూడగానే వర్షం వస్తుంది అనుకోవడం ఓకే కానీ నిజం కాదు  అలాగే  ఈ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి  మరణానికి సిద్ధమై ఉండి తీరవలసిందే  జాతస్యహి ధ్రువో మృత్యు హు  అన్న వేద సూక్తిని అనుసరించి  ప్రతి ఒక్కరూ దానిని నమ్ముతారు  మరి ఈ ప్రాణం పోకుండా ఉండే ఉపాయాన్ని గురించి ఏ మానవుడైనా ఆలోచించాడా  ప్రయత్నం చేసినాఅది అతని చేతిలో ఉంటుందా  కనుక కాలానికి తల ఒగ్గి జీవించడమే  బుద్ధిమంతుల లక్షణం అంటాడు వేమన. ఈ విషయాన్ని గురించి వేముల వ్రాసిన ఆటవెలది పద్యాన్ని ఒక్కసారి చదవండి.

"వాన రాకడ మరి ప్రాణంబు పోకడ కనపడదు ఘనులకైన గాని కనబడిన మీద కలి ఇట్లు నడుచునా..."  



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం