ఈ భూమి మీదకు తల్లి గర్భం నుంచి వచ్చే బిడ్డకు కూడా తన కులం ఏంటో మతం ఏంటో వారు ఏ పద్ధతిని అనుసరించారు ఎలా జీవించాలి ఏమీ తెలియకుండానే ఏకాంతంగా వస్తాడు వచ్చిన వాడు పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చుకుంటూ జీవితంలో కొన్ని హద్దులు కొన్ని నియమాలు పెట్టుకుంటాడు. దీనిని పెద్దలు ఎలా అనుసరిస్తున్నారు తన కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి ఏ పద్ధతిలో మెలుగుతున్నారు అన్న విషయాలన్నిటినీ గమనించుకుంటూ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర జాతులలో ఏది తన జాతి ఈ నాలుగు జాతులలో ఏ జాతి గొప్పది దాని తర్వాత ఏ జాతి అంటూ లెక్కలు వేసుకుంటూ కూర్చోవడం తప్ప దాని మూలానికి వెళ్లి ఆలోచించేవారు చాలా తక్కువ. సమాజంలో ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకోవాలంటే భగవద్గీతలో ఉన్న విషయాలను మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది గీతాకారుడు చెప్పిన విషయాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణాన్ని అతను చేసే పనిని దృష్టిలో పెట్టుకొని అతని మతాన్ని కులాన్ని ఏర్పాటు చేశారు తప్ప వేరే కారణం ఏమీ లేదు అంటాడు సమాజంలో కొంతమందిని మనం చూస్తున్నట్లయితే బాగా ధనవంతుని ఇంట్లో పుట్టిన కుర్రవాడు కూడా ఇంటి నుంచి పారిపోయి బయటకు వెళ్లి తన కడుపు నింపుకోవడానికి ఏ హోటల్ లోనో పని చేయడం మాట పట్టింపు వల్ల తాను చేసిన ఈ చిన్న పనికి జీవితమంతా బాధపడే నిర్ణయం తీసుకోవడం ఆ వయసులో తెలిసీతెలియని మనసుతో తీసుకున్న నిర్ణయంగా మనం భావించవచ్చు. ఒక వ్యక్తి జీవనోపాధి కోసం కష్టపడి వ్యవసాయం చేస్తూ శూద్రుడు అనిపించుకుంటాడు దానిని వ్యాపారం కన్నా మార్చి ఒకచోట నుంచి మరోచోటకు మార్పిడి చేస్తూ జీవితాన్ని గడిపే వాడిని వైశ్యుడు అని అంటారు తన గ్రామానికి కానీ తన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రక్షణ చేసేవాడిని క్షత్రియులు అని పిలుస్తారు సమాజానికి పనికి వచ్చే పనులను గురించి ఆలోచించి చక్కటి సూచనలు తెలిసి బ్రహ్మజ్ఞానం తెలిసిన యోగ్యులను బ్రాహ్మణులు అని చెబుతారు తప్ప దేశాలన్నీ తిరిగి దాని మూలాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఏమాత్రం ప్రయోజనం లేదు అంటాడు వేమన ధ్యానం కలిగిన వాడే ఉత్తమ జాతికి చెందిన వాడు అని నిర్ణయించాడు కూడా చదవండి ఆ ఆటవెలది పద్యాన్ని.
"జాతులందు మిగుల జాతి యేదెక్కువో యెరుగలేక తిరుగనేమి ఫలమొ యెరుక గలుగువాడె హెచ్చయిన కులజుండు..."
;
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి