పల్లె సొగసులు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ రోజుల్లో మా గ్రామానికి కాలువలు రాలేదు  ధనికులైన రైతులు వారి పొలాల లో  చెరువులు తగించుకొని దానికి సరిపడిన నీళ్లు  పెట్టి వారు వాడుకోగా మిగిలిన నీటిని ప్రక్క వారికి పంపిణీ చేసేవారు అలా పొలాలు పండటానికి చెరువులు ఎంతో దోహదపడుతూ ఉంటాయి  విజయవాడ దగ్గర ప్రాజెక్టు కట్టక పూర్వం పొలాలలో మెట్టపైరు పండించేవారు పెద్ద నూతులు అంటే మోట బావులు అనేవారు వాటిని తోడి ఆ నీటిని  వ్యవసాయానికి ఉపయోగించేవారు  యాతాంతో తోడి నీరు పెట్టడం దాని ప్రత్యేకత  ఆ రోజుల్లో ముఖ్యమైన పంట గోంగూర అదే వాణిజ్య పంట  పండించిన ఆకుకూరలు కూరగాయలు కావిడితో తీసుకువెళ్లి ప్రక్క గ్రామాలలో అమ్ముకుంటూ ఉండేవాడు.
ఏలూరు కాలువ వచ్చిన తర్వాత ప్రాజెక్టు నుంచి నీరు వచ్చింది ప్లాటుగా ఉన్న భూమిని సదువుని చేసి కట్టుడు పెట్టుకున్నారు చదును గల భూములను ఒకటి రెండు ఎకరాలుగా మాడులు కట్టుకొని  తొలకరి వర్షాలు పడిన తర్వాత రైతులు తమ వ్యవసాయానికి అన్నీ సిద్ధం చేసుకుంటారు  షాదను తడిపి రెండు మూడు సార్లు దుక్కి దున్నేవారు  చదును చేసే అంతవరకు దాదాపు రెండు మూడు సార్లు దుక్కులు ఉంటాయి  ప్రతి రైతు ఇంట్లోనూ పచ్చి రొట్ట శుభ్రంగా కుళ్లి ఉండేది  ఆ రోజుల్లో ఎకరానికి సుమారు 5 లేక 6 బస్తాలు పంట చేతికి వచ్చేది  కొన్నేళ్లు పోయిన తర్వాత భూమిని ఎకరాకి మూడు నాలుగు సార్లు మెత్తగా దున్ని కాలవనీళ్లు వచ్చిన తర్వాత ఒడ్లు  తీసుకొని వెళ్లి మెత్తగా తయారు చేసిన మడిలో సెంటుకు మూడు మానికలు చొప్పునచల్లుతారు.
అలుకులు చేసినప్పుడు వచ్చిన దిగుబడి కంటే నాటు వేసిన చేలలో దిగుబడి మూడు లేక నాలుగు రెట్లు ఎక్కువగా వస్తుంది అప్పుడు చేలలో పశువుల ఎరువులు మాత్రమే వేస్తూ ఉండేవాడు  రాను రాను రసాయన ఎరువులు వేస్తున్నారు దిగుబడి కూడా 30 నుంచి 35 బస్తాల వరకు వచ్చేది  ఆ రోజుల్లో ఆరు నెలలకు గాని ఒడ్లు తయారై కోతలు కోసం ఒకచోట చేర్చేవారు  అది దీర్ఘకాలిక పంట పూర్వం ఒక వరి మాత్రమే  ఒక పంటనే పండించేవాడు ఈ రోజుల్లో రెండు పంటలు మూడు పంటలు కూడా పండిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో రెండవ పంటగా పెసర మినుము వేస్తారు  అప్పట్లో వారి కుప్ప చుట్టూ ఏడెంటి గజాల వెడల్పున ఉమ్మడి మొడును కోసి కళ్లం తయారు చేసి అక్కడ  ధాన్యాన్ని వేరు చేసేవారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం