జననీ జన్మభూమిశ్చ...అని వాల్మీకి మహర్షి రామునితో లక్ష్మణునకు చెప్పించిన విషయం కన్నతల్లిని కన్న భూమిని ఏ ఒక్కడు మర్చిపోలేడని ప్రపంచానికి తెలుసు ప్రపంచము అంటే ప్ర అంటే అతి పెద్దదైన పంచం పంచభూతములతో ఏర్పడిన శరీరము అని అర్థం అలాంటి జన్మభూమికి ఏమి ఇచ్చి రుణ తీర్చుకోగలం నా తల్లి సీతారత్నమ్మ అల్లారు ముద్దుగా పెంచి మమ్మల్ని ఇంత వారిని చేసింది. పుట్టిన ఊరు తేలప్రోలు స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనే విషయం తెలియజేసిన స్థలం భూ ప్రపంచంలో ఎవరు ఎక్కడకు వెళ్లినా ఈ ఇద్దరిని మర్చిపోయే స్థితి ఎవరికి ఉంటుంది అందుకే మా గ్రామం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను.
నువ్వులు పండించే గ్రామం కనుక తేలప్రోలు గా ప్రసిద్ధి చెందింది మా గ్రామంలో శివలింగ ప్రతిష్ట గాలిగోపురం ఆవరణలో పరుశురాముడు జరిపాడని ఉత్తర రామాయణ కర్త ఆడిదం సూరన్న గారి వివరణ పరశురాముడు భారతదేశంలో 21సార్లు యుద్ధాలు చేసి రాజులను సంహరించుకుంటూ వెళ్లి కన్యాకుమారి వద్ద పరశురాముడు శివుని గూర్చి తపస్సు చేసి మెప్పించాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చితిని ఏమి కావాలో కోరుకో అంటే నేను చేసిన హత్యలకు పాప పరిహారం పరిష్కారం కావాలి అని కోరాడు అప్పుడు ఈశ్వరుడు నీవు ఇక్కడ నుంచి హిమాలయాల వరకు నా యొక్క లింగముల (శివలింగముల) ప్రతిష్ట చెయ్ మొత్తం 101 లింగాల ప్రతిష్ట జరిగితే నీకు పాప పరిహారం అవుతుంది అని చెప్పాడు అని పురాణ గాధ.
దేశంలో శివలింగ ప్రతిష్టలు శివాలయాలు ఎన్నో ఉన్నాయి కదా అన్న సందేహాన్ని వెలిబుచ్చాడు పరశురాముడు దానికి శివుడు అన్నీ కూడా తూర్పు ముఖం ఉంచి ప్రతిష్ట జరిగాయి ఇకముందు కూడా అలానే జరుగుతాయి కావున నీవు నీ ప్రతిష్టలు పడమర ముఖంగా ప్రతిష్ట చేసుకుని వెళ్ళు అని చెప్పాడు అలా ప్రతిష్ట చేస్తూ వెళ్లిన ఆ నాటి ఒక శివలింగ ప్రతిష్టలో మనకు మా దేవాలయంలో ఉన్న శివలింగం ఒకటి. ఈ ప్రతిష్ట పడమర ముఖంగా దూరంగా ఉంది కనుక ఈ శివలింగ ప్రతిష్ట పరశురాముడు అతని ఆధ్వర్యంలో జరిగినట్లు చరిత్ర తెలియజేస్తోంది. గాలిగోపురం 1913లో ప్రారంభించి 1915 కి కట్టడం పూర్తయింది ఈ గోపురాన్ని శనగల అక్కమ్మ గారు కట్టించారు.
గ్రామ స్థితి;- ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి