దేవరల బండారం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సమాజంలో మనం అనేక మతాలను చూస్తూ ఉంటాం  ఒక్కొక్క మతం వారికి  మరికొన్ని చీలికలు ఉంటాయి  ఏ చీలిక వారి పద్ధతి వారికే ఉంటుంది రెండవ పద్ధతి వాడికి నచ్చదు వీరు చేసినదే సరి అయిన పద్ధతి అని నమ్ముతూ  దానిని అనుసరిస్తూ  తన జీవనాన్ని సాగిస్తూ ఉంటారు.  జంగమ అన్న  శాఖలో ఉన్న వ్యక్తులు  శివుని తప్ప మరొకరిని  పూజించరు  వారి నోట మరొక మాట రాదు  వారి అహార్యాన్ని  ఒకసారి మనం గమనించినట్లయితే  తెల్లటి దుస్తులను ధరించి  తలగుడ్డ చుట్టి  మెడలో హారాలతో పాటు  ఒక సూత్రానికి బంధించిన  శివలింగాన్ని  ధరించి ఇంటింటికి తిరుగుతూ  తన చేతిలో ఉన్న శంఖంతో ఓంకారాన్ని  పలికిస్తూ బిక్షం ఎత్తుకుంటూ ఉంటారు.
యోగి పొంగవులను మనం గమనించినట్లయితే  ముందు తనను తాను స్వాధీన పరచుకొని  ఆ తర్వాత తాను  ఏ భగవత్ స్వరూపాన్ని నమ్ముకుని  ధ్యానిస్తూ ఉంటాడో  ఆ స్వరూపంపైనే మనసు కేంద్రీకరించి  నిశ్చల దృష్టితో  తపస్సమాధికి వెళ్లడం మనం గమనిస్తాం  నిజాయితీగా ఆ యోగి  నిర్మల మనసుతో ధ్యానానికి  అంకితమైతే తప్ప  భగవత్ స్వరూపం సాక్షాత్కరించి  తనకు మోక్షం ప్రసాదించదు అని ప్రతి ఒక్కరు నమ్ముతారు  మనసులో అభిప్రాయం లేకుండా  ఏదో నామ కీర్తనలు చేస్తూ  సహస్ర నామాలు చేసిన  భగవంతునిపై దృష్టి మరల్చనివాడు  భగవంతునికి ప్రీతి పాత్రులు కాదు అన్న విషయం స్పష్టం  నిజాయితీగా చేసే వారికి మరొక దారి తెలియదు అని చెప్తున్నాడు వేమన. జంగమ దేవరాలను  ఎద్దేవ చేస్తూ అసలు శివుడు ఎక్కడ ఉన్నాడో వీడికి తెలుసునా  లింగాన్ని గుండె మీద పెట్టుకున్నంత మాత్రం చేత  ఆ లింగాన్ని ఈశ్వరుడు దొంగలిస్తాడా ఎందుకంత దాపరికం అతని మనసులో నిశ్చలమై ఉన్న భగవత్ స్వరూపం ఈశ్వరునిది  మాత్రమే  అని అతనికి స్పష్టంగా తెలిసినప్పుడు  శివుని ఆకారాన్ని  లింగాకారంలో పెట్టి దానిని ధరించి దానిని జాగ్రత్తగా చూసుకుంటూ  తన గుండెను స్పర్శించేలా  అంటే తాను మర్చిపోతానేమోనన్న భయం కాక మరేది. హాయిగా మనసులో ఆయన కొంచెం చేసినప్పుడు  ఈ అనవసర పూజలు ఈ ప్రత్యేకమైన ప్రదర్శన అవసరమా అన్నది  వేమన ప్రశ్న. తాను ఆచరించి చూపిన విషయాన్ని పద్య రూపంలో మనకందించారు ఆ  కంద పద్యాన్ని చదవండి.

"బందెరాళ్లతోడ బంధించి కట్టంగ లింగడేమి దొంగిలించినాడో  యాత్మలింగమేల నర్చించి చూడరో ..."


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం