అంజనాదేవి-ఆంజనేయుడు.డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 పాలకడలి లోఉద్బవించిన రంభా-ఊర్వశి-మేనక-పుప్పగంధి-సుకేసి-మహాశ్వేత-ప్రమ్లోచ-మనోరమ-ప్రమధర-ఘృతాచి-గీతాజ్ఞ-చారుహాసిని-చంద్రప్రభ-సోమ-విద్యున్మాల-అంబుజాక్షి-కాంచనమాల-వంటి 16,051మంది అప్సరసలలో ఒకతైన "పుంజకస్ధల"శాపవశాన కుంజరుని కుమార్తేగా "అంజనాదేవి"పేరున జన్మించింది. ఈమెభర్త కాంచనపర్వతనివాసి .ప్రముఖవానరవీరుడు ."శంఖం" "శబలం" అనేఏనుగులు ప్రభాసతీర్ధంలోని మునులఆశ్రమాలను ధ్వంసం చేస్తుండేవి.మునివర్యుల కోరికపై ఆ ఏనుగులను సంహరించడంతో సంతసించినమునులు ఏదైనా వరం కోరుకో అన్నారు. కోరినరూపంధరించగలిగే మహాబలశాలి అయిన పుత్రుని ప్రసాదించమని వేడుకున్నాడు కేసరి.త్వరలో శ్రీమహావిష్ణువు శ్రీరాముని గా జన్మించబోతున్నాడని ,అతనికి నమ్మినబంటుగా ఉండి లోకకల్యాణం కొరకు దుష్టశిక్షణ,రాక్షస సంహారంచేసే పుత్రుడు వాయుదేవుని వరాన నీకు కలుగుతాడని మునులు ఆశీర్వదించారు.ఒకరోజు అంజనాదేవి వనవిహారంచేస్తుండగా ప్రత్యక్షమైన వాయుదేవుడు"దేవి నీవు కారణజన్మురాలివి.నావలన నీకు మహాన్నతబలపరాక్రమ తేజోసంపన్నుడు ధీమంతుడు అయిన పుత్రుడుజన్మిస్తాడు "అని వరం ప్రసాదించి వెళ్ళాడు.కొంతకాలానికి ఆమెకు బిడ్డజన్మించాడు.అతనికి "సుందరుడు"అనిపేరుపెట్టారు.బాల్యంలో ఒకరోజు సూర్యుని పండుగా భావించి ఆకాశానికి ఎగసి సూర్యుని మింగబోయాడు.అడ్దగించి తనవజ్రాయుధంతో సుందరుని దవడ( హనుమ)భాగాన కొట్టాడు.సృహకొల్పోయిన సుందరుని చూసి అంజనాదేవి దంపతులు ఎంతగానో దుఖిఃచసాగారు.కొపంతో వాయుదేవుడు గాలిని స్ధంబింపజేసాడు.గాలిలేక సమస్తప్రాణకోటి గిలగిల లాడసాగాయి.శివుడు ప్రత్యక్షమై అమ్మ అంజనా బాదపడకు నీబిడ్డచిరంజీవి.అంజనాపుత్రుడు అయినందున "ఆంజనేయుడిగా"హనుమభాగంలో తికబడినవాడుగా అయినందున"హనుమంతుడుగా"పిలవబడతాడు.సుగ్రీవునికిమంత్రిగా,శ్రీరాముని నమ్మినబంటుగా సకలజనులచే కీర్తింపబడతాడు,రాబోవుకాలంలో అర్జునుని ధ్వజం పై కపిముద్ర ఉండేలా వరంప్రసాదిస్తాను"అని పలు వరాలుయిచ్చి,వాయుదేవునితోపాటు అందరిని సంతోషపరచి వెళ్ళాడు.
విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది. అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన చూపు కోల్పోయింది. తరువాత అహల్యకు సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానర ముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి, సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణంలో ఉంది.
; ;

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం