'పదో తరగతి వరకు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి'; - హెచ్.ఎం. ఈర్ల సమ్మయ్య

 వివిధ సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యంతో పాటు పిల్లల మానసిక, శారీరక, వికాసాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధించబడుతుందని, పిల్లల్ని పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. శనివారం ఆయన కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో పాఠశాల ఉపాధ్యాయినులతో కలిసి పిల్లల తల్లిదండ్రుల ఇండ్లను సందర్శించి కరపత్రాలను అందజేశారు. పిల్లల్ని ఎస్సీ కాలనీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులు, యువతీ, యువకులు, గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డబ్బులు ఊరికే రావని, ఎంతో చెమటోడ్చి కష్టించి సంపాదించిన ప్రతి పైసా చాలా విలువైందని, వాటిని వృధా చేసుకోకుండా పిల్లల భవిష్యత్తు అవసరాలకు వినియోగించాలన్నారు. కొందరు పనిగట్టుకొని ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయుల పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తల్లిదండ్రులు నమ్మకూడదని, మాయ మాటలకు మోసపోకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించి, సకల సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను పొందాలన్నారు.  విజ్ఞానం, వివేకం, శాస్త్రీయ దృక్పథం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమవుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలన్నారు. తన ఇద్దరు పిల్లల్ని పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాననని ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య గుర్తు చేశారు. కొంతమంది ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారని, వారిని త్వరలోనే 'మేఘన సాహితీ కళావేదిక' ఆధ్వర్యంలో సన్మా నిస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 'మన ఊరు మన బడి' పథకం కింద సుమారు రూ. 15 లక్షల వ్యయంతో పాఠశాల ఆధునికరణ, అన్ని వసతులతో పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేశామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రత్యేకంగా సన్మానిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం