ఎవరిపని వారే! అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత అన్నాడు "పిల్లలూ!బడి తెరిచే రోజులు దగ్గర పడుతున్నాయి. పుస్తకాలకి బట్టలు వేసి పేర్లు రాశారా?"" ఆ!అమ్మా నాన్నా వేస్తారులే తాతా! ఐనా నీవు వేయొచ్చు కదా?' "ఓరీ తాతకు దగ్గులు నేర్పే రకాలు మీరు. మీవయసులో నేను  పురపాలక ఊడ్చి పాలు పితికేవాడ్ని.మీనాన్న  పాలపాకెట్స్ పేపర్ బాయ్ గా పనిచేసి కాలేజీ చదువు ఉద్యోగం సంపాదించాడు.
మీకో కథ చెప్తా వినండి. అనాథ పిల్లాడికి ఎవరో మంత్రం చెప్పి  -"ఇది జపిస్తే చాలు. దేవుడు  అంతా చేస్తాడు అంటే పాపం వాడు అలాగే జపం చేస్తూ కూచున్నాడు రెండు రోజులు. మూడోరోజు నీరసంగా ఉన్న వాడిని ఊరిపెద్ద చూసి ఇలా అన్నాడు "ఓరి అమాయకుడా ఉట్టి మంత్రం చాలదు.పనిచేస్తూ నామజపం చేస్తే ఫలితం త్వరగా దక్కుతుంది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తా." అలా అనాధాశ్రమంలో పెరిగి కష్టపడి చదివి  నేడు ఓపరిశ్రమపెట్టి అందరికీ  ఆదర్శంగా ఉన్నాడు.కష్టేఫలీ! గాలిలో దీపం పెట్టి దేవుడా నీమహిమ అనరాదు." అంతే పిల్లలంతా కిక్కురు మనకుండా పుస్తకాలు అట్టలు తెచ్చి  సరైన సైజు లో పెట్టి కట్ చేస్తే  తాత  ఎలా పుస్తకం కి అట్ట వేయాలో చూపి  పిన్నులు కొట్టాడు.పిల్లలు తమపేరు క్లాస్ రాసి మురిసి పోయారు. 🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం